తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న హీరో విక్రమ్. ఆ మద్య ఆయన కూతురు ఎంగేజ్ మెంట్ కి పెట్టిన రింగు మిస్ కావడంతో పెద్దకలకం రేగింది. అయితే అంత సెక్యూరిటీగా ఉన్న ఆ రింగు వేలి నుంచి పడిపోయిందా..లేక ఎవరైన దొంగిలించారా అన్న విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు డీఎంకె నేత కరుణానిధి మనవడితో విక్రమ్ కూతురు నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా వేలికి తొడిగిన ఉంగరం మిస్ కావడం అనేది ప్రిస్ట్రేజియస్ గా తీసుకున్నారు. ఈ విషయమై విక్రమ్ కూడా ఉన్నతాధికారులకు దర్యాప్తు ముమ్మరం చేయమని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం.
అసలు విషయానికి వస్తే..విక్రమ్ కుమార్తె అక్షితకు- డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మనవడు రంజిత్కు ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఆ నిశ్చితార్దం ఫంక్షన్లో రంజిత్ తన కాబోయే వైఫ్కి ఎంగేజ్మెంట్ రింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ రింగ్ మిస్సైంది.నిశ్చితార్థం ఉంగరం పోయినట్లు అక్షిత, విక్రమ్లు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
అక్షిత మంగళవారం ఖాదర్ నవాజ్ఖాన్ రోడ్డులోని ఓ ఐస్క్రీం పార్లర్కు వెళ్లానని అయితే అక్కడ ఉన్నపుడు చేతికి రింగ్ ఉన్నదని కానీ వచ్చే సమయానికి వేలికి రింగ్ కనిపించకుండా పోయిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా అ క్షిత, రంజిత్ ల వివాహం వచ్చే యేడాదిలో జరగనుంది.