విశాఖలో మంచు మనోజ్ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన గొడవ చినికి చినికి గాలి వానగా మారుతోంది. మంచు మనోజ్ నటిస్తున్న ఒక్కడే మిగిలాడు చిత్ర నిర్మాత అచ్చిబాబుపై జూనియర్ ఆర్టిస్టు ఏజెంట్లు చేయి చేసుకున్నారని కథనాలు వచ్చాయి. ఇదే తరహాలో హీరో మంచు మనోజ్‌ కూడా కామెంట్లు చేశాడు. 

మనోజ్ చేసిన వ్యాఖ్యలపై జూనియర్ ఆర్టిస్టు ఏజెంట్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. నిర్మాతపై చేయి చేసుకున్న మాట పూర్తి అవాస్తవమని ఏజెంట్లు తెలిపారు. విశాఖ జర్నలిస్టు ఫోరమ్‌లో మీడియాతో  సమావేశమైన జూనియర్ ఆర్టిస్టు ఏజెంట్లు తాము నిర్మాత అచ్చిబాబుపై చేయి చేసుకోలేదని స్పష్టం చేసారు. 


తమకు అన్నం పెట్టే నిర్మాతలపై తాము ఎందుకు చేయి చేసుకుంటామని అన్నారు. నిర్మాత తమకు ఇవ్వాల్సిన డబ్బులు అడిగినందుకు ఇలా తమపై లేనిపోని అపవాదులు వేస్తున్నారని వాపోయారు. హీరో మంచు మనోజ్‌ కూడా విషయం తెలుసుకోకుండా ఇలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని దుయ్యబట్టారు.

మంచు మనోజ్ తమ నుంచి వివరాలు తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేదని ఏజెంట్లు అన్నారు. ఈ విషయంపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.



మరింత సమాచారం తెలుసుకోండి: