సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు వారి సహనటులను వివాహం చేసుకొని సెటిల్ అయిన వారు కొందరు ఉంటే..మరికొందరు వివాహం అయిన కొంత కాలానికే విడిపోయిన వారు ఉన్నారు.  తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలా పాల్  విషయంలో కూడా ఇలాగే జరిగింది..కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కొంత మంది నటులు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా ఉన్నారు. అయతే కొంత మంది  హీరోయిన్లు వివాహం అయిన తర్వాత నటించడం మానేస్తుంటారు. బాలీవుడ్ లో అయితే విశ్వసుందరి ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్ పెళ్ళయినా ఇంకా హీరోయిన్లగానే చేస్తున్నారు.

తాజాగా వీరి లీస్టులోకి చేరింది స్నేహ..2012 లో తమిళ నటుడు ప్రసన్నను పెళ్ళి చేసుకుంది వీరికి  2015లో బాబు పుట్టాడు.  సినిమాలు, యాడ్స్ లో చేస్తున్న స్నేహ గత సంవత్సరం త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరో గా వచ్చిన ' సన్నాఫ్ సత్యమూర్తి ' లో ఉపేంద్ర కు జోడీగా చేసింది.

బాబు వున్న తనకి హీరోయిన్ పాత్రలు రావని డిసైడ్ అయిన స్నేహ ఇప్పుడు ఏ  క్యారెక్టర్ రోల్స్ చేస్తానని అంటోంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ చిత్రాలలో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. తనకు తెలిసిన దర్శక నిర్మాతలకు టచ్ లో వుంటూ మంచి ఆఫర్ల కోసం ఎదురు చేస్తోంది స్నేహ.


మరింత సమాచారం తెలుసుకోండి: