ఈ మద్య కాలంలో మల్టీస్టారర్ చిత్రాలు బాగానే వస్తున్నాయి. అయితే గతంలో కొద్ది మంది హీరోల్లో ఈగో ఫీలింగ్ తో మల్టీస్టార్ చిత్రాలు వచ్చేవి కావని టాక్ ఉండేది..కానీ గత కొంత కాలంగా మల్టీ స్టార్ చిత్రాలు బాగానే వస్తున్నాయి. టాలీవుడ్ లో ఇప్పుడు సీనియర్ల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆ మద్య సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ‘సీతామ్మ వారికట్లో సిరిమల్లె చెట్టు ’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తర్వాత ఇదే వెంకటేష్, పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో వచ్చిన ‘గోపాల గోపాల’ చిత్రం కూడా సూప్ హిట్ గా నిలిచింది.  ఇక మెగా ఫ్యామిలీ హీరోల్లో అప్పుడప్పుడు ఇలాంటి రేర్ కాంబినేషన్స్ వస్తుంటాయి.

ఆ మద్య చిరంజీవి శంకర్ దాద జిందా బాద్ చిత్రంలో లాస్ట్ మూవ్ మెంట్ లో పవన్ కళ్యాన్ రావడంతో ఆడియన్స్ కేరింతలు కొట్టారు. తర్వాత ‘ఎవడు’ చిత్రంలో బావాబామ్మర్ధులు రాంచరణ్, అల్లు అర్జున్ నటిస్తారు. కాకపోతే ఈ చిత్రంలో ఇద్దరూ ఒకేసారి కనిపించకపోయినా ఆ ఇద్దరు ఉన్న చిత్రం మాత్రం అద్బుత విజయం సాధించింది. రాంచరణ్ తేజ్ సినిమాలో మళ్ళీ అల్లు అర్జున్ నటించనున్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం రాం చరణ్ నటిస్తున్న ‘ధృవ’ చిత్రంలో మరోసారి అల్లు అర్జున్ కనిపించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

చరణ్ కోసం అల్లు అర్జున్ ఎటువంటి పాత్ర చేయడానికైనా సరే రెడీ అన్న విషయం తెలిసిందే ఇక సురేందర్ రెడ్డి తనకు రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ ని అందించాడు పైగా చరణ్ తో సినిమా నిర్మిస్తున్నది నాన్న అల్లు అరవింద్ కాబట్టి ఇలా అన్ని అంశాలు కలుస్తున్నాయి. ఎలాగూ ఈ చిత్ర అల్లు అరవింద్ నిర్మిస్తుండగా  అల్లు అర్జున్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది . ఎవడు తో మెగా ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా ప్రేక్షకులందరినీ అలరించిన చరణ్ -అల్లు అర్జున్ లు మరోసారి తెరమీద కనిపిస్తే మెగా ఫ్యాన్స్ ఆనందాలకు అవధులే ఉండవు. 


మరింత సమాచారం తెలుసుకోండి: