అక్కినేని నాగార్జున హీరోగా వస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ 'ఓం నమో వెంకటేశాయ'. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీపై ఇండస్ట్రీలోనూ మంచి హైప్ ఏర్పడుతుంది. నాగార్జున ఇప్పటికే పలు భక్తి చిత్రాలలో నటించి…బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నారు. చాలా గ్యాప్ తరువాత మళ్ళీ నాగార్జున భక్తి పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఓం నమో వెంకటేశాయ' కావటంతో…ఈ మూవీ కచ్ఛితంగా విజయాన్ని సాధిస్తుందనేది మార్కెట్ వర్గాల అంచనా.


ఇదిలా ఉంటే తాజాగా అక్కినేని నాగార్జున తన మూవీకి సంబంధించిన ప్రి లుక్ ని రిలీజ్ చేశారు. కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కతున్న ఈ భక్తిరస ప్రధాన చిత్రపు ప్రి లుక్, మార్కెట్ వర్గాలని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో పలు ఏరియాలకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ అందరూ చిత్ర నిర్మాత వద్దకి వచ్చి బేరాలు మొదలు పెట్టడం జరుగుతుంది. అయితే ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం మేరకు సీడెడ్ కి సంబంధించిన 30 కోట్ల రూపాయల బిజినెస్ ని నిర్మాతలు ఇప్పిటికే క్లోజ్ చేశారని అంటున్నారు.


ఒక్క సీడెడ్ లోనే ఇప్పటికే 30 కోట్ల రూపాయల బిజినెస్ జరగటంతో ఈ మూవీ కచ్ఛితంగా ప్రి రిలీజ్ కి ముందే 70 కోట్ల రూపాయల బిజినెస్ ని జరుపుకోవటం ఖాయం అని అంటున్నారు. నాగార్జున నటించిన గత చిత్రాలతో పోలిస్తే…ఇది రికార్డే అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో నాగార్జున వేంకటేశ్వరస్వామి భక్తుడు హథీమ్ రామ్ బాబాగా కనిపించనున్నారు. ఈ సినిమాకు కథని జె.కె. భారవి అందించారు.


ఉత్తర భారతదేశానికి చెందిన హథీమ్ రామ్ బాబా తిరుమల శ్రీవారికి వీర భక్తుడు. శ్రీనివాసుడిని నిత్యం భక్తిశ్రద్ధలతో కొలిచేందుకు తిరుపతిలో స్థిరపడిపోయాడు. ఇప్పటికి ఆయన సమాధి తిరుపతిలో ఉంది. అయితే ఈ మూవీని నార్త్ ఇండియాలోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హధీమ్ రామ్ బాబాకి నార్త్ ఇండియాలోనూ భక్తులు ఉన్నారు. అందుకే ఈ మూవీని వెంటేశ్వరస్వామి భక్తులు అధికంగా ఉన్న ప్రాంతంలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సెర్చింగ్ చేస్తుంది.


ఇక ఓవర్సీస్ మార్కెట్ లో ఈ మూవీపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవర్సీస్ లో ఉన్న నాగార్జున అభిమానులు ఎప్పటికప్పుడు ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ని తెలుసుకుంటున్నారు. రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్ లో వస్తున్న ఈ'ఓం నమో వెంకటేశాయ' చిత్రం కచ్ఛితంగా 100 కోట్ల రూపాయల మార్కెట్ ని టచ్ చేయటం ఖాయం అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: