సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చాడు. వర్మ ఇకపై టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల్లో ఇలాగే ఉంటారని ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఇప్పటి వరకూ రామ్ గోపాల్ వర్మ ఏదైనా కామెంట్ చేశారు అంటే దాన్ని తిరిగి తీసుకోవటం అనేది జరగదు. ఇది వర్మ నైజం అని అంటారు. తనకి ఏది కరెక్ట్ అనిపించిందో...దాన్నే మాట్లాడతారు.


చాలా మంది వర్మ పబ్లిసిటి కోసం మాట్లాడతారు అని అనుకుంటారు కానీ..వర్మ గురించి తెలిసినవారు మాత్రం వర్మ చెప్పేవన్నీ నిజాలే అని అంటారు. అయితే తాజాగా వర్మ మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం.150 పై కామెంట్ చేశారు. మెగా అభిమానలందరికీ తను ట్విట్టర్ వేధికగా క్షమాపణలు చెప్పాడు. ఖైదీ నెం. 150 ఫస్ట్ లుక్ చూసిన తరువాత తన అభిప్రాయం మారిందని, ఈ లుక్ చిరంజీవి కెరీర్లోనే బెస్ట్ లుక్ అని ట్వీట్లు పెట్టారనే విషయం తెలిసిందే.


వర్మ ఇలా క్షమాపణలు చెప్పటం చాలా అరుదు. అదీనూ మెగాస్టార్ మూవీ విషయంలో జరగటం విశేషం. అయితే గతంలో వర్మ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీపై వరుస కామెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీపై ఎటువంటి కామెంట్స్ చేయటం లేదు. అంతే కాకుండా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోలపైనా వర్మ ఎటువంటి కామెంట్ చేయకూడదని నిర్ణయించుకున్నారంట. అందుకే వర్మ తీసుకున్న ఈ నిర్ణయానికి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్ అయింది.


వర్మలాంటి వారు ఎప్పటికప్పుడు ఇండస్ట్రీకి చురకలు అంటిస్తేనే కొంత బాగుంటుందనేది ఇండస్ట్రీలోని వారి అభిప్రాయం. కానీ వర్మ ఇప్పుడు తన రూటు మార్చుకోవటంతో ఇది కొంత షాకింగ్ లా మారింది. ప్రస్తుతం వర్మ బాలీవుడ్ చిత్రాలపై శ్రద్ధ చూపుతున్నారు. త్వరలోనే సర్కార్ 3కి సంబంధించిన మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్ళనున్నారని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: