సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ అమలాపాల్. అమలాపాల్ నటిస్తున్న మూవీలు ఇండస్ట్రీలో మంచి హిట్స్ ని సాధిస్తున్నప్పటికీ...తను మాత్రం ఫిల్మ్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టి మ్యారేజ్ లైఫ్ లోకి వెళ్ళింది. దీంతో అమలాపాల్ ఫ్యాన్స్ కొంత నిరుత్సాహంలో పడ్డారు. డైరెక్టర్ విజయ్ ని పెళ్ళి చేసుకున్న తరువాత అమలాపాల్ ఎటువంటి మూవీల్లో నటించలేదు. విజయ్ మాత్రం తన పర్సనల్ లైఫ్ లోకి కొత్త అలవాట్లను తెచ్చుకోవటంతో అమలాపాల్ కొంత ఇబ్బంది పడింది.


దీంతో అమలాపాల్ సైతం తిరిగి మూవీల్లో నటిస్తాను అనే ప్రపోజల్ ని భర్త విజయ్ ముందు ఉంచింది. అందుకు విజయ్ నో చెప్పటంతో..ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటంతో వీరిద్దరు కోర్టుకెక్కి విడాకులు కోరిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే అమలాపాల్ స్టార్ హీరోలతో నటించేందుకు సిద్ధంగా ఉంది. అందులోని భాగంగానే కొన్ని కథలను తను వింటున్నారు. ఇప్పటికే ధనుశ్ హీరోగా రూపొందుతున్న 'వడచెన్నయ్' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.


అలాగే ఓ కన్నడ సినిమాలో ఆఫర్ ని అందుకుంది. గతంలో ధనుశ్, అమలపాల్ తమిళంలో నటించిన 'వేల ఇల్లే పట్టాదరి' కన్నడలో రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు రవిచంద్రన్ తనయుడు మనోరంజన్ హీరోగా నటిస్తుండగా...ఇందులో హీరోయిన్ గా అమలాపాల్ కన్ఫర్మ్ అయ్యారు. అయితే మరో ఆశ్ఛర్యకరమైన విషయం ఏమిటంటే...డైరెక్టర్ విజయ్..స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో మరో మూవీ తెరపైకి రానుంది.


ఇందులో ఒక హీరోయిన్ గా అమలాపాల్ నటించనున్నారు. ప్రస్తుతం విడాకుల విషయం కోర్టులో ఉన్నప్పటికీ...తన భర్త విజయ్ దర్శకత్వంలో తను హీరోయిన్ గా చేయటానికి ఒప్పుకోవటం అపూది కోలీవుడ్ ఇండస్ట్రీని ఆశ్ఛర్యపరిచింది. ఈ విషయంలో భర్త విజయ్ సైతం షాక్ అయ్యాడని ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: