నిన్న  జరిగిన చిరంజీవి  పుట్టినరోజు వేడుకలు మెగా అభిమానులకు ఎంత జోష్ ని ఇచ్చాయి అన్న విషయాన్ని పక్కకు పెడితే తమకు బయటకు చెప్పుకోలేని అవమాన భారాన్ని చిరంజీవి 61వ పుట్టినరోజు వేడుకులు తమకు మిగిల్చాయి అంటూ మెగా అభిమానులలోని ఒక వర్గం తీవ్ర అసహనంతో బాధ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి కేక్‌ కటింగ్‌ చేస్తారు సినిమా ఫస్ట్‌ లుక్‌ అక్కడే విడుదలవుతుంది పవన్‌కళ్యాణ్‌ కూడా వస్తాడట ఇలా చాలాచాలా ఊహలతో వచ్చిన మెగా అభిమానులకు నిన్న ఈవెంట్ లో జరిగిన విషయాలు ఏమాత్రం నచ్చలేదు అనే వార్తలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి.   

ప్రతీ మెగా ఆడియో ఫంక్షన్ లో షరామామూలుగా కనిపించే  పాటలు  డాన్సులు తప్ప నిన్నటి ఫంక్షన్ లో ఏముంది అంటూ మెగా అభిమానులు చాలా మంది తమలో తాము కుమిలి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఓవరాల్‌గా ఈవెంట్‌ని రామ్ చరణ్ సరిగ్గా మేనేజ్‌ చేయలేకపోయాడు అన్న కామెంట్స్ కొందరు మెగా అభిమానులే చేస్తున్నారు అంటే ఈ ఫంక్షన్ మెగా అభి మానులకు ఏస్థాయిలో  నిరాశను  కలిగించిందో అర్ధం అవుతుంది. 

చిరంజీవి పుట్టినరోజు వేడుక అంటే ఒక రేంజ్ లో భారీ స్థాయిలో అనుకుంటే చరణ్‌ అల్లు అర్జున్‌ మరికొందరు మెగా యంగ్ హీరోలతో పాటు దర్శకులు వినాయక్‌, సురేందర్‌రెడ్డి, ఒకరిద్దరు ప్రముఖులు తప్ప ఈవేడుకకు ఎవ్వరు రాకపోవడం మెగా అభిమానులకు షాక్ ఇచ్చిన్సట్లు టాక్. దీనికి తోడు  వేదిక పై జరిగిన ఉపన్యాసాలు కూడ అతి మాములుగా జరగడంతో  అభిమానుల్ని ఉర్రూతలూగించిన సందర్భాలే లేవు అని మెగా అభిమానులు తమలో తాము కామెంట్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనికితోడు  చిరంజీవి ఈకార్యక్రమానికి డుమ్మా కొట్టడంతో అభిమానులు విపరీతమైన నిరుత్సాహానికి గురి అయినట్లు వార్తలు వస్తున్నాయి.  దీనికి తోడు అభిమానులే తన ఆరో ప్రాణం అని చెప్పే చిరంజీవి, నిన్న ఈ కార్య క్రమామ్నికి రాకుండా నిన్న హైదరాబాద్ లో ని ఒక ఒక  స్టార్‌ హోటల్లో పార్టీ ఏర్పాటుచేసిన  కార్య క్రమానికి చిరంజీవి హాజరు అవ్వడంతో జీర్ణించుకోలేని అవమానంతో మెగా అభిమానులకి ‘పుండు మీద కారం చల్లినట్లు’ గాఫీల్ అవుతున్నారు అని వార్తలు వస్తున్నాయి.

అభిమానులు పాల్గొనే ఈవెంట్‌కి వెళితే, అక్కడ మళ్ళీ పవన్‌కళ్యాణ్‌ పేరుతో ఏమన్నా హడావిడి జరుగుతుందా ? అన్న అనుమానంతో చిరూ  ఈ మెగా ఈవెంట్‌కి డుమ్మా కొట్టారనే ప్రచారం జరుగుతోంది. కారణం ఏదైనాగానీ, మెగా ఈవెంట్‌ మాత్రం మెగా ఫ్లాప్‌ అయ్యిందని అభిమానులే అంటున్న పరిస్థితిఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు అందరూ కలిసి రాష్ట్రం అంతటా పూజలు, జపాలు, హోమాలు తొమ్మిది రోజులు నిర్వహిస్తే కనీసం అభిమానుల కోసం ఓ అరగంట పాటు కార్యక్రమానికి హాజరు కావడానికి చిరంజీవికి ఖాళీ లేదా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
 
దీనికి తోడు నిన్న స్టార్ హోటల్ లో జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకలను కవర్ చేయడానికి వెళ్ళన మీడియా వారిని మెగా కాంపౌండ్ ఏమాత్రం పట్టించుకోక పోవడంతో మీడియా వర్గాలు కూడ చిరంజీవి పై కోపం గా ఉన్నట్లు టాక్.  రాజకీయలాలలోకి మళ్ళి యాక్టివ్ రావాలని ప్రయత్నాలు చేయడమే కాకుండా ఎంతో గ్యాప్ తీసుని సినిమాలలో నటిస్తున్న చిరంజీవి అటు అభిమానులతో ఇటు మీడియా వర్గాలతో ఎందుకు ఇలా ప్రవర్తించాడు అనే విషయం చాలా మందికి సమాధానం లేని ప్రశ్నగా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: