మహేష్ బాబు తనకు ‘సైమా’ లాంటి ప్రముఖ సంస్థలు అవార్డు ఇచ్చినా తీసుకోవడానికి వెళ్ళడు. తన కుటుంబ సభ్యుల ఫంక్షన్స్ కు తప్ప బయట జరిగే వివాహ వేడుకలకు కూడ చాల అరుదుగా వస్తూ ఉంటాడు మహేష్. అయితే గత సంవత్సరం చిరంజీవి షష్టిపూర్తికి రాని మహేష్ నిన్న రాత్రి పార్క్ హయత్ హోటల్ లో జరిగిన మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన గ్రాండ్ పార్టీకి తన భార్య నమ్రత తో సహా వచ్చి అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు. 

టాప్ హీరోలు కొందరు మాత్రమే వచ్చిన ఈ డిన్నర్ పార్టీకి మెగా కుటుంబానికి పెద్దగా సన్నిహితం కాని మహేష్ ప్రత్యేకంగా రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.  దీనితో ఈ డిన్నర్ పార్టీకి వచ్చిన చాలామంది అతిధులు ఈ పార్టీకి పవన్ రాని లోటును మహేష్ తీర్చాడు అంటూ కొందరు కామెంట్స్ చేసుకున్నట్లు టాక్.

ఈమధ్య కాలంలో మహేష్ తన సినిమాలకు సంబంధించి అదేవిధంగా తన కెరియర్ కు సంబంధించి టాలీవుడ్ లో ఏ వర్గంతోను సమస్యలు తెచ్చుకోకుండా వివాదాలకు దూరంగా ఉండాలని మహేష్ భావిస్తున్నాడు.  దీనికి కొనసాగింపుగా మహేష్ ఈ విధంగా మెగా కాంపౌండ్ కు తన స్నేహ హస్తాన్ని అందించి తాను అందరి వాడుగా తనకు తాను నిరూపించుకోవడానికి మహేష్ ఈ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

‘బ్రహ్మోత్సవం’ పరాజయం తరువాత టాలీవుడ్ లోని ఏ సెలెబ్రెటీ ఇంటిలో జరిగిన ఫంక్షన్ లోను మహేష్ ఇంత ఉత్సాహంగా పాల్గొన లేదు.  టాలీవుడ్ సినిమా రంగానికి సంబంధించి అప్పటికీ ఇప్పటికీ చిరంజీవి నెంబర్ వన్ అని గతంలో చెప్పిన మహేష్ తన మాటలను రుజువు చేసుకుంటూ ఇలా నిన్నటి పార్టీలో హల్ చల్ చేయడం చిరంజీవి బర్త్ డే పార్టీకే హాట్ న్యూస్ గా మారింది.   

ఈ కార్యక్రమంలో మహేష్ కాకుండా ‘మెగా’ కోటరీ హీరోలు రవితేజ, శ్రీకాంత్ లు రావడం జరిగితే నాగార్జున ప్రతినిధిగా అఖిల్ ఈ పార్టీలో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ కార్యక్రమంలో సీనియర్ హీరోలకన్నా యంగ్ హీరోలు ఎక్కవగా పాల్గొనడంతో చిరంజీవి బర్త్ డే పార్టీకి ఒక కొత్త కళ వచ్చిoది..  


మరింత సమాచారం తెలుసుకోండి: