సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని హీరోయిన్స్ స్లోగా పిక్ అప్ అవుతుంటారు. ముఖ్యంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొద్ది హిట్స్ ని సాధించిన హీరోయిన్స్ వెంటనే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి జంప్ అయి...భారీ రెమ్యునరేషన్ ని అందుకుంటారు. ఒక్కోసారి కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన నటించిన హీరోయిన్స్ తెలుగులో భారీ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ని కైవసం చేసుకున్న హీరోయిన్ రెజీనా.


తను తాజాగా తమిళంలో ''మానగరం'' అనే సినిమాలో చేసింది. ఈ మూవీకి సంబంధించిన థియోట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వ్యవహారం అంతా చడీ చప్పుడు కాకుండా జరిగింది. ఈ సినిమాలో సందీప్ కిషన్, రెజీనా హీరో హీరోయిన్లగా చేశారు. చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ థియోట్రికల్ ట్రైలర్ పై ఇప్పుడు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ వినిపిస్తున్నాయి. 


''సిటీలో కోటి మంది జనం ఉంటారు. కాని నడిరోడ్డులో పట్టుకుని ఒకడ్ని కొడుతుంటే.. ఒక్కడు కూడా రాడేంటి?'' అన్నది ఈ మూవీ కాన్సెప్ట్ గా తెలుస్తుంది. పలు భిన్న కథాంశాలతో తెరకెక్కిన ఈ మూవీ కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ ని సాధింస్తుందని అంటున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ దశలోనే ఉండగా..రెజీనాకి కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి మరో ఆఫర్ వచ్చింది. దాదాపు కోటిన్నర రూపాయల రెమ్యురనేషన్ తో ఓ మూవీకి తను ఒప్పుకుంది.


కోలీవుడ్ కి చెందిన స్టార్ హీరో మూవీలో ఈ బ్యూటీ ఆ ఆఫర్ ని చేజిక్కించుకున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు నుండి అందుతున్న సమాచారం. ఇప్పటి వరకూ రెజీనా కేవలం 60 లక్షల రూపాయల వరకూ రెమ్యునరేష్ తీసుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్ కి జంప్ అవ్వటంతో...ఈ బ్యూటీ ఫుల్ హ్యాపీలో ఉన్నట్టుగా తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: