మెగా ఫాన్స్ కు ఒక ఊహించని షాక్ ఇవ్వబోతున్నాడు రామ్ చరణ్.  ఎవరూ ఊహించని విధంగా రామ్ చరణ్ నటించబోయే కొత్త సినిమాకు ‘మెగా ఎక్స్ ప్రెస్’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.  అయితే ఇటువంటి టైటిల్ ఫిక్స్ చేయడానికి వెనుక ఒక సెంటిమెంట్ ప్రధాన కారణం అని అంటున్నారు.

రామ్ చరణ్ ఎప్పటి నుంచో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాకు దర్శకత్వం వహించిన మేర్ల పాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమాను చేయడానికి అంగీకరించాడు అన్న వార్తలు హడావిడి చేస్తూనే ఉన్నాయి. అయితే మేర్ల పాక గాంధీ రామ్ చరణ్ కు నచ్చిన కథ చెప్పలేక పోవడంతో ఈ మూవీ ప్రాజెక్ట్ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది.

అయితే ఇప్పుడు ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం మేర్ల పాక గాంధీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీని చరణ్ కు చెప్పడం ఆ కథ నచ్చడంతో చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం అన్నీ చకచకా జరిగి పోయాయి అన్న వార్తలు వస్తున్నాయి.  అయితే దర్శకుడు గాంధీకి ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ టైటిల్ బాగా కలిసి రావడంతో ఆ ‘ఎక్స్ ప్రెస్’ కలిసి వచ్చే విధంగా ఈ కొత్త సినిమాకు ‘మెగా ఎక్స్ ప్రెస్’  అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్.

ఈ టైటిల్ వీలైనంత త్వరలో రిజిస్టర్ చేయమని రామ్ చరణ్ మేర్ల పాక గాంధీని కోరినట్లు వార్తలు వస్తున్నాయి.  తెలుస్తున్న సమాచారం మేరకు చరణ్ ఈసినిమాను సుకుమార్ దర్శకత్వంలో తాను నటించ బోతున్న సినిమా పూర్తి అయిన వెంటనే వచ్చే సంవత్సరం సమ్మర్ నుంచి ఈ ‘మెగా ఎక్స్ ప్రెస్’  షూటింగ్ కోసం పట్టాలేక్కుతుంది అని టాక్.

చరణ్ ఇప్పటి వరకు తన కెరియర్ లో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు చేయని నేపధ్యంలో తన అభిమానులకు వెరైటీగా ఉంటుందని ఈ ‘మెగా ఎక్స్ ప్రెస్’  కు ఓటు  వేసినట్లు టాక్.  దీనినిబట్టి చూస్తూ ఉంటే ‘ధృవ’ లో పోలీసు ఆఫీసర్ గా కనిపించబోతున్న చరణ్ ఆ తరువాత సుకుమార్ దగ్గర లవర్ బాయ్ గా మారిపోయి మళ్ళీ వెనువెంటనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కథలోకి మారిపోవడం చూస్తూ ఉంటే చరణ్ తన సినిమాల ఎంపికలో రకరకాల ప్రయోగాలు చేస్తున్నట్లుగా అర్ధం అవుతోంది. 

ఇప్పటికే తన లుక్ ను ‘ధృవ’ సినిమా కోసం పూర్తిగా మార్చుకుని ఏదోవిధంగా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్న నేపధ్యం తెలిసిందే.  ఇది ఇలా ఉండగా ‘ధృవ’ సినిమాలో చరణ్ తో పాటు అల్లు అర్జున్ కూడ కొన్ని సీన్స్ లో అతిథి పాత్రలో కనిపించ బోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి అంటే హిట్ కోసం చరణ్ ఎన్ని రకాల మ్యాజిక్ లు చేస్తున్నాడో అర్ధం అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: