అల్లు ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఏ స్టార్ హీరో కొట్టలేనన్ని వరుస హిట్లతో బాక్సాఫీస్ ను షేక్ ఆడిస్తుంటే ఆ తర్వాత వచ్చిన అల్లు శిరీష్ రీసెంట్ గా వచ్చిన శ్రీరస్తు శుభమస్తుతో హిట్ ఖాతా తెరిచాడు. అయితే ఓ హిట్ సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్న శిరీష్ ఆ సినిమా శ్రీరస్తు కంటే హిట్ అవడం జీర్ణించుకోలేకపోతున్నాడు. 


ఇంతకీ శిరీష్ మిస్ అయిన సినిమా ఏది అంటే పెళ్లిచూపులు. తరుణ్ భాస్కర్ డైరక్షన్లో విజయ్, రీతు వర్మ జంటగా నటించిన ఈ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా దర్శక నిర్మాతలు సినిమా మొత్తం పూర్తయ్యాక రిలీజ్ కోసం ముందు అల్లు అరవింద్ ను కలిశారట. సినిమా చూసి నచ్చిన అరవింద్ శిరీష్ ను పెట్టి ఆ సినిమా మొత్తం మళ్లీ తీయండి ఈ సినిమాకు ఎంత ఖర్చు అయ్యిందో అది తాను పెట్టుకుంటా అన్నాడట.


అయితే అలా చేయడం ఇష్టం లేని దర్శక నిర్మాతలు ఆ తర్వాత సురేష్ బాబుని కలవడం అతని కూడా నచ్చి రిలీజ్ చేయడం జరిగిందట. అయితే తరుణ్ భాస్కర్ చేసిన పెళ్లిచూపులు చిన్న సినిమానే కాని అల్లు అరవింద్ మాత్రం దీన్ని మరింత కమర్షియల్ గా తీద్దాం అనేశాడట. ఫ్యాన్సీ ఆఫర్ కూడా ఇచ్చాడట. కాని రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాను ఆపేయడం కరెక్ట్ కాదని పెళ్లిచూపులు టీం ఆ డీల్ కు ఒప్పుకోలేదు.


ప్రస్తుతం రిలీజ్ అవుతున్న సినిమాలేవి అంతగా ఆకట్టుకోలేకపోవడంతో మూడు వారాల క్రితం రిలీజ్ అయిన పెళ్లిచూపులు ఇంకా కలక్షన్స్ హవా కొనసాగిస్తుంది. విజయ్ కెరియర్లో రెండో సినిమానే ఇంత పెద్ద విజయం దక్కడంతో అతని తర్వాత సినిమాల కోసం దర్శక నిర్మాతలందరు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పెద్ద పెద్ద బ్యానర్ల నుండి అతనికి అవకాశాలు ఇచ్చేందుకు ఫోన్ చేస్తున్నారట.


ప్రస్తుతం విజయ్ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో రానున్నాడు. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం డైనమిక్ డైరక్టర్ నందిని రెడ్డి డైరక్షన్లో మరో సినిమా కమిట్ అయ్యాడని టాక్. ఇంకా ఆ మూవీకి సంబందించిన డీటేల్స్ బయటకు రాలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: