యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జనతా గ్యారెజ్’ కి సంబంధించిన టాక్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా వినిస్తున్నాయి. ఈ మూవీ తాజాగా సెప్టెంబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు రెడీ అవుతుందన్న విషయం తెలిసిందే. ఇందులో కీలక నిర్ణయం దిల్ రాజు అని ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే తాజాగా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న జనతా గ్యారేజ్ చిత్రం…పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం అనుకున్న డేట్ కంటే త్వరగా పూర్తి చేసుకుంది.

దీంతో రిలీజ్ డేట్ ని ఒక రోజు ముందుకు జరుపుకునేందుకు వీలు కుదిరింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్…జనతా గ్యారేజ్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ చాలా క్వాలిటీగానూ మరింత వేగంగానూ పూర్తి చేయటంతో ఇది సాధ్యపడింది. గతంలో జనతా గ్యారేజ్ మూవీని ఆగష్ట్ లో  రిలీజ్ చేయాలని చూశారు. కానీ ఆ టైంకి పోస్ట్ ప్రొడక్షన్ ని పూర్తి చేయలేమని దేవిశ్రీ చెప్పటంతో…రిలీజ్ డేట్ ని సెప్టెంబర్ కి వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇక మార్కెట్ అంచనాలను బాగా పసిగట్టగల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ప్లాన్ ప్రకారం, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కావటంతో ఈ మూవీని ఒక రోజు ముందుగానే రిలీజ్ చేస్తే..కలెక్షన్స్ ని పెంచుకునే ఛాన్స్ ఉంటుందని హీరోకి చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని నిర్మాతలు కూడ ఒప్పుకోవటంతో ఈ సినిమా విడుదల తేదీలో మార్పు జరిగింది. సెప్టెంబర్ 2న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ సెప్టెంబర్ 1నే ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

అయితే దీనికి చిత్ర యూనిట్ చెప్పిన కారణం మరొకటి. సెప్టెంబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా బంద్ ఉండడంతో ఆ రోజున అన్ని షోస్ పడే అవకాశం లేదని అందుకే ఒకరోజు ముందుగా రిలీజ్ అవుతున్నట్టుగా చెప్పారు. కానీ అసలు కారణం మాత్రం దిల్ రాజు ఆలోచనే అనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మొత్తంగా సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 5 వినాయక చవితి వరకూ జనతా గ్యారెజ్‌కు వరుస సెలవులు ఉండటం ఇది మూవీ కలెక్షన్స్ కి హెల్ప్ అవుతుందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: