పవన్ డాలీ దర్శకత్వంలో  నటించ బోతున్న లేటెస్ట్  సినిమాలో శృతి హాసన్   హీరోయిన్ గా ఎంపిక అయినా ఇంకా పవన్ ఈ షూటింగ్ కు జాయిన్ కాకపోయిన నేపధ్యంలో శ్రుతిహాసన్ పవన్ కళ్యాణ్ ల మధ్య రొమాంటిక్ సీన్స్ ఎప్పుడు తీస్తారో ఈసినిమా దర్శకుడు డాలీకే తెలియని పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే.  అయితే వీరిద్దరూ ఈ లేటెస్ట్ మూవీ విషయంలో ఇంకా కలవకపోయినా కన్నడ సినిమా ‘జాగ్వార్’ విషయంలో మాత్రం ఒక విధంగా కలిసి పని చేస్తున్నారు.

కన్నడ సినిమా రంగంలో కనివినీ ఎరుగని భారీ పెట్టుబడి 70 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ‘జాగ్వార్’ తెలుగులో కూడ డబ్ చేయబడుతున్న విషయం తెలిసిందే.  కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడాను హీరోగా పరిచయం చేస్తున్న ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ను చేయడానికి శ్రుతిహాసన్ తన అంగీకారాన్ని తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి.

సామాన్యంగా శ్రుతిహాసన్ సినిమాలో ఐటమ్ సాంగ్స్ చేయడానికి అంగీకరించదు. అయితే నిఖిల్ గౌడ నటిస్తున్న ‘జాగ్వార్’ మూవీలో శ్రుతిహాసన్ చేత ఒక స్పెషల్ సాంగ్ ను చేయించడానికి ఈ సినిమా దర్శక నిర్మాతలు చాల కష్టపడి ఒప్పించడమే కాకుండా ఆమెకు చాల భారీ స్థాయిలో పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే సెప్టెంబర్ 20న జరగబోతున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు పవన్ అతిధిగా రావడానికి అంగీకరించాడు అని వార్తలు వస్తున్న నేపధ్యం తెలిసిందే.  అయితే ఇప్పుడు పవన్ తో పాటు ‘జాగ్వార్’ విషయంలో శ్రుతిహాసన్ కూడ తన వంతు సహాయం చేస్తూ ఉండటంతో పవన్ శ్రుతిహాసన్ ల జంట ‘జాగ్వార్’ ను టాలీవుడ్ లో ప్రమోట్ చేస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. 

కన్నడ సినిమా రంగంలో భారీ బడ్జెట్ సినిమాలను తీయడానికి నిర్మాతలు పెద్దగా ఆ శక్తి కనపరచరు.  ఈ భారీ బడ్జెట్ సినిమా సంస్కృతి అంతా టాలీవుడ్ కోలీవుడ్ లలోనే కనిపిస్తుంది.  అయితే రాజకీయ నాయకుడుగా కర్నాటక రాష్ట్ర రాజకీయాలలో ఒక ప్రముఖ స్థానంలో ఉన్న కుమార్ స్వామి తన కొడుకు నిఖిల్ ను హీరోగా చేసి అటు రాజకీయాలను ఇటు సినిమాలను ప్రభావితం చేయాలని చేస్తున్న ప్రయత్నాలలో భాగమే ‘జాగ్వార్’ నిర్మాణం.

సామాన్యంగా పవన్ బయట సినిమాల కార్యక్రమాలకు అతిధిగా రావడం చాల అరుదైన విషయం.  మెగా కుటుంబ ఫంక్షన్స్ కు కూడ దూరంగా ఉండే పవన్ కుమారస్వామి పట్ల నిఖిల్ గౌడ పట్ల చూపెడుతున్న ప్రేమ వెనుక ఎన్నో ఎత్తుగడలు ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: