టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ అనుకోని విధంగా డ్రాప్ అవుతాయి. అయితే అలా జరగటానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నప్పటికీ..తరువాత కూడ ఆ కాంబినేషన్స్ సెట్స్ మీదకు రాలేదంటే మాత్రం అది చర్చనీయాంశంగా మారతాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో అటువంటిదే ఒక కాంబినేషన్ ఉందని అంటున్నారు. అదే మెహార్ రమేష్, రామ్ చరణ్ తేజ్ ల కాంబినేషన్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను చూస్తే...వీరిద్దరి కాంబినేషన్ లో నిజానికి ఒక మూవీ రావాల్సి ఉంది.

కన్నడ సూపర్ స్టార్ పుణీత్ రాజ్ కుమార్ తో డైరెక్టర్ గా వచ్చిన మెహార్ రమేష్, తరువాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో తీసింది నాలుగు చిత్రాలు అయినప్పటికీ...అవి బాక్సాపీస్ వద్ద అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ వి రెండు  చిత్రాలు ఉన్నాయి. 2008లో వచ్చి ఎన్టీఆర్ కంత్రి మూవీకి మెహార్ రమేష్ డైరెక్టర్ గా ఉన్నారు. కంత్రి మూవీ యావరేజ్ అయినప్పటికీ... మళ్ళీ జూనియర్ తోనే శక్తి మూవీ అంటూ మరోసారి వీరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళింది.

ఈ గ్యాప్ లో మెహార్ రమేష్, రామ్ చరణ్ కి ఓ కథని చెప్పుకొచ్చారు. అప్పుట్లో రామ్ చరణ్ కొద్దిగా బిజిగా ఉండటంతో..అది కాస్త పోస్ట్ పోన్ అయింది. చిరుత మూవీని ముగించుకొని...మగధీర మూవీకి రామ్ చరణ్ రెడీ అవుతున్నారు. అయితే మగధీర తరువాత రామ్ చరణ్ తో మూవీని తీయాల్సి ఉండగా మెహార్ రమేష్ కి అది కూడ సాధ్యం కాలేదు. అప్పటికే మెహార్ రమేష్ బిల్లా మూవీని తెరకెక్కించి ప్లాప్ లో ఉన్నారు.

ఆ సమయంలో వీరిద్దరి కాంబినేషన్ అస్సలు సెట్ అవ్వదని ప్రముఖ నిర్మాత రామ్ చరణ్ కి సలహా ఇచ్చారంట. దాంతో రామ్ చరణ్ సైతం మెహార్ రమేష్ కి మరో ఛాన్స్ ని ఇవ్వలేదు. దాంతో వీరిద్దరి మధ్య ఎటువంటి కథా చర్ఛలు జరగలేదు. ఇక బిల్లా మూవీ తరువాత మెహార్ రమేష్ తెరకెక్కించిన శక్తి, షాడో వంటి చిత్రాలు బాక్సాపీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అవ్వటంతో...తన ఫిల్మ్ కెరీర్ ప్రస్తుతం డైలమాలో ఉందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: