ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన `మ‌న‌లో ఒక‌డు` టీజ‌ర్ ను బుధ‌వారం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మీడియా మొఘ‌ల్ రామోజీరావు విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జి.సి. జగన్ మోహన్ నిర్మిస్తున్నారు. ఇందులో 'నువ్వు నేను' ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయికగా న‌టించారు. 


ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ `` మా సినిమా మీడియా నేప‌థ్యంలో సాగుతుంది. మా టీజ‌ర్‌ను మీడియా మొఘ‌ల్ రామోజీరావుగారు విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ పూర్త‌యింది. కృష్ణ‌మూర్తి అనే సామాన్య అధ్యాప‌కుడి క‌థ ఇది. కొన్ని య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా అల్లుకున్నాం`` అని అన్నారు.


నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ ``రామోజీరావుగారి చేతుల మీదుగా టీజ‌ర్ విడుద‌ల కావ‌డం మా అదృష్టం. ఆయ‌న టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌డ‌మే కాకుండా మా యూనిట్ స‌భ్యుల్ని ఆశీర్వ‌దించారు. ప్ర‌స్తుత స‌మాజంలో మీడియా పాత్ర ఏంటో మ‌నందరికీ తెలుసు. అలాంటి మీడియా నేప‌థ్యంలో సాగే క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించాం. ఈ నెల 27న పాట‌ల్ని విడుద‌ల చేస్తాం. షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం`` అని చెప్పారు. 


సాయికుమార్ మాట్లాడుతూ ``రామోజీరావుగారి స‌మ‌క్షంలో చిత్ర టీజ‌ర్ విడుద‌లైనందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నేను చాలా మంచి పాత్ర‌లో న‌టించాను. త‌ప్ప‌కుండా అంద‌రినీ అల‌రించ‌డ‌మే కాకుండా ఆలోచింప‌జేసే సినిమా అవుతుంది`` అని తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: