చిరంజీవి నాగార్జునల మధ్య సాన్ని హిత్యం ఓపెన్ సీక్రెట్. వీరు స్నేహితులు మాత్రమే కాకుండా అనేక వ్యాపారాలలో భాగస్వాములు. అందుచేతనే వీరిద్దరూ ఎప్పుడూ కూడ ఒకినొకరు టార్గెట్ చేసుకునే కామెంట్స్ చేయరు. అయితే ఈ కుటుంబాలకు చెందిన యంగ్ హీరోల సినిమాలు అనుకోకుండా ఒకదాని పై ఒకటి పోటీ పడే సందర్భాలు వచ్చినప్పుడు మాత్రమే నాగార్జున చిరంజీవిలకు మాత్రమే లేనిపోని తల నొప్పులు ఎదురౌతున్నాయి.
గత సంవత్సరం దసరా సీజన్ కు ‘అఖిల్’ ‘బ్రూస్ లీ’ సినిమాల మధ్య దసరాకి వార్ జరగబోతోంది అంటూ ఫిలింనగర్ లో హడావిడి చివరి నిముషం వరకు జరిగింది. అయితే చివరి నిముషంలో అఖిల్ దసరా రేస్ నుంచి తప్పుకుని దీపావళికి వచ్చాడు. అయితే దసరాకు వచ్చిన ‘బ్రూస్ లీ’ కాని దీపావళికి వచ్చిన ‘అఖిల్’ కానీ రెండు పరజయాన్నే మూటగట్టుకున్నాయి.
అయితే మళ్ళీ అదే సీన్ రాబోతున్న దసరాకు రిపీట్ కాబోతూ ఉండటం చూసిన వారు ఇది కావాలని చేస్తున్న ఒక వ్యూహాత్మక ఎత్తుగడ అయి ఉంటుందా ? అనే అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం రామ్ చరణ్ నటిస్తున్న ‘ధృవ’ సినిమాతో పాటుగా నాగచైతన్య ‘ప్రేమమ్’ కూడ అక్టోబర్ 7న దసరాను టార్గెట్ చేస్తూ విడుదల కావడానికి తమ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు సినిమాల పై చరణ్ నాగాచైతాన్యలు చాల ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు వరస పరాజయాలతో సతమతమౌతున్న చరణ్ చైతూలకు ఈసినిమాల ఫలితంలో ఏదైనా తేడా వస్తే అది వారి కెరియర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది. ఈ పరిస్థుతుల నేపధ్యంలో చరణ్ చైతన్యల సినిమాలు ‘ధృవ’ ‘ప్రేమమ్’ ఒకదాని పై ఒకటి పోటీగా ఎందుకు విడుదల అవుతున్నాయో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి అని అంటున్నారు.
అయితే ఫిలింనగర్ లోని కొన్ని వర్గాలు మాత్రం చైతన్య చివరి వరకు టెన్షన్ క్రియేట్ చేసి క్రితం సంవత్సరం తన తమ్ముడు అఖిల్ చేసినట్లుగానే చరణ్ కు లైన్ క్లియర్ చేస్తాడు అని అంటున్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా అక్కినేని నాగేశ్వరరావు జయంతి అయిన సెప్టెంబర్ 20వ తారీఖునాడు ‘ప్రేమమ్’ ఆడియో ఫంక్షన్ జరగబోతోందని టాక్.
అదేవిధంగా సెప్టెంబర్ 17వ తారీఖునాడు రామ్ చరణ్ ‘ధృవ’ ఆడియో ఫంక్షన్ జరపడానికి ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఒకే నెలలో కేవలం మూడు రోజుల గ్యాప్ తో వీరిద్దరి ఆడియో ఫంక్షన్స్ జరుగుతూ ఉండటంతో నిజంగానే మెగా అక్కినేని వార్ కు దసరా వేదిక కాబోతోంద అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే చివరి నిముషంలో మాత్రం ఎదో ఒక ట్విస్ట్ ఉంటుంది అన్నది ఫిలింనగర వర్గాల అభిప్రాయం..