సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటూ ఎప్పుడూ వార్తలలో ఉండే సమంత తనకు ఉన్న మంచి మనసుతో ఎప్పుడూ సేవా కార్యక్రమాలు చేసే విషయంలో కూడ ముందు వరసలో ఉండటానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది.  ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన సమంత భగవంతుడు తనకు కలిగించిన అదృష్టం వల్ల వచ్చిన సంపదలో ఎంతో కొంత దానం చేయాలి అన్న దృక్పధంతో ‘ప్రత్యూష ఫౌండేషన్’ కార్యక్రమాలకు అనేక సార్లు సహాయ సహకారాలు అందిస్తున్న విషయం తెలిసిందే.  

ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ సంస్థ తరపున అభాగ్యులైన చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది సమంత.  ఆమె చేస్తున్న ఎన్నో కార్యక్రమాలలో లేటెస్ట్ గా ఆమె చేసిన సేవా కార్యక్రమం అక్కినేని నాగార్జున దృష్టి వరకు వెళ్ళడంతో నాగ్ చాల ఆనంద పడుతున్నట్లు టాక్. 

లేటెస్ట్ గా ఒక ప్రమాదంలో కాలు కోల్పోయిన చిన్నారికి మళ్లీ నడిచే భాగ్యం కల్పించింది సమంత.  ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా భవాని అనే ఐదేళ్ల చిన్నారికి కృత్రిమ కాలు అమర్చారు అని తెలుస్తోంది. మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్లో ఈ శస్త్ర చికత్సను విజయవంతంగా పూర్తి చేశారు. 

డాక్టర్ మంజుల ఈ ఆపరేషన్లో పాల్గొని ఈ శస్త్ర చికిత్సను పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  డాక్టర్ మంజుల స్వతహాగా కూడా గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. ఈమె అనేక ఆపరేషన్స్ ను ఉచితంగా నిర్వహించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

ఇప్పటికే సేవా కార్యక్రమాల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసింది సమంత. ఎదో ఒకరోజున అక్కినేని కుటుంబ కోడలుగా సమంత మారబోతోంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో అక్కినేని అమలకు స్పూర్తిని ఇచ్చే విధంగా సమంత తరుచూ చేస్తున్న సేవా కార్యక్రమాలతో అక్కినేని కుటుంబాన్ని తన మాటలతోనే కాకుండా తన సేవాకార్యక్రమాలతో కూడ బాగా ఆకట్టుకుంటోంది అనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: