ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతా గంధరగోళంగా ఉంది. పవర్ స్టార్ అభిమానిని యంగ్ టైగర్ అభిమానులు కత్తులతో పొడవటం అనేది ఇండస్ట్రీలోని సినీ హీరోలను సైతం కలవర పెడుతుంది. అసలు జరిగింది ఫ్యాన్స్ మధ్య గొడవేనా? లేక గొడవ చేసింది వేరే వ్యక్తులా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే పవన్ కళ్యాన్ ఒక అడుగు ముందుకు వేసి...దీనికి సంబంధించిన కేసు పై తను పోరాడతానని స్టేట్మెంట్ ని ఇచ్చారు.

కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో ఇద్దరు సినిమా హీరోల అభిమానుల మధ్య రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణలో కత్తిపోట్లకు గురై మరణించిన సంగతి తెలిసిందే. వెబ్ మీడియాలో ఇద్దరు హీరోల మధ్య గొడవలు అని వస్తున్నప్పటికీ...ఎలక్ట్రానిక్ మీడియాలో మాత్రం పవన్ ఫ్యాన్స్ వర్సెస్ జూనియర్ ఫ్యాన్స్ అంటూ బ్రేకింగ్ న్యూస్ లని టెలికాస్ట్ చేయటంతో అంతా రచ్ఛగా మారింది. ఇదిలా ఉంటే అసలు జరిగిన కథ ఏంటి అనేదానిపై ఇప్పటికే పోలీసులు రంగంలోకి దిగారు.

అలాగే ఈ ఇద్దరు టాప్ హీరోలు సైతం వారికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు. ఫ్యాన్స్ మధ్య గొడవలు రావటం అనేది ఏ హీరో కూడ ఎంకరేజ్ చేయరు. అలాంటిది ఫ్యాన్స్ మధ్య గొడవలు...చివరకు చంపుకునే వరకూ రావటం అనేది మరింత విక్రుత చర్యగా భావిస్తున్నారు. అయితే జూనియర్ ఫ్యాన్స్ దీనిపై సమగ్ర నివేధికను హీరోకి అందజేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు.

ఈ విషయంపై యంగ్ టైగర్ సైతం బాధపడ్డాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా అభిమానుల మధ్య ఈ తరహా వాతావరణం అనేది ఏ మాత్రం మంచిది కాదని హీరోలు భావన. తాజాగా పవన్ కల్యాణ్ తిరుపతిలో మరణించిన అభిమాని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కేసును సీబీఐ విచారణ కూడా కోరతామని తెలిపారు. హీరోలు ఎప్పుడూ కలిసి ఉంటారు..వారి మధ్య ఎటువంటి విభేదాలు ఉండవని పవన్ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని అభిమానులు కూడ గుర్తించాలని కోరటం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: