తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకంగా అభిమానించే అభిమానులే కాదు హీరో..హీరోయిన్లు కూడా ఉన్నారు. అందుకే ఆయన 150 వ చిత్రం కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం అని అన్నారు. ఆ మద్య బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ 149 సరైన నెంబర్ కాదు..150 నే చిరంజీవికి సరైన నెంబర్ అని అన్నారు. ఇక తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మీరు తప్పకుండా నాకోసం 150 వ చిత్రం చేయాలి అన్నారు. ఇలా అందరూ అభిమానించే మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న తన పుట్టిన రోజు హయత్ హోటల్ లోఘనంగా జరుపుకున్నారు. ఈ పుట్టిన రోజు వేడుకకు అతిరథ మహారధులు వచ్చారు.

టాలీవుడ్ లో హీరోలు అందరూ వచ్చారు..అంతే కాదు వారితో పాటు వారి శ్రీమతులు కూడా రావడం విశేషం.  ఈ పార్టీకి  మహేష్ తో పాటు నమ్రతా శిరోద్కర్ కూడా విచ్చేసింది. అయితే అక్కడున్నంత సేపూ.. చెర్రీ వైఫ్ ఉపాసన.. అండ్ బన్నీ వైఫ్ స్నేహ రెడ్డితో నమ్రత భలే టైమ్ స్పెండ్ చేసిందట. ఇంకేముంది సెల్ఫీలపై సెల్ఫీలు..ఈ ముగ్గురిలో నమ్రత మాత్రమే సినిమాల్లో నటించింది. అందుకే కాబోలు మీతో ఓక స్నాప్ అంటూ ఇద్దరూ ఫోటోలు దిగారు.

ఇదే విషయాన్ని షేర్ చేసిన ఉపాసన.. ''అమేజింగ్ భార్యలు.. అదిరిపోయారు'' అంటూ కామెంట్ కూడా చేసింది. అంతేకాదండోయ్.. ''వెయిటింగ్ ఫర్ శ్రీయ భూపాల్'' అని కూడా చెప్పింది.  ఇంతకీ శ్రీయ ఎవరా అనుకుంటున్నారా..! అక్కినేని అఖిల్ కాబోయే శ్రీమతి. మరో విషయం ఏంటంటే ఈ ఫంక్షన్లో పవన్ కళ్యాన్ మూడవ భార్య   అన్నా లెజ్ నేవా కూడా సందడి చేసింది.


 


మరింత సమాచారం తెలుసుకోండి: