ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ 'ధ్రువ'. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 7వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ సైతం ఈ మూవీని నిర్మాణ పరంగా క్వాలిటీగా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా 'ధ్రువ' చిత్ర టీం నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ మూవీకి సంబంధించని క్లైమాక్స్ లో భారీ మార్పులు చేసినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి.


తమిళ వెర్షన్ తనిఒరువన్ లోని క్లైమాక్స్ ని పూర్తిగా మార్పులు చేయటంతో...ఇది తెలుగు నేటివిటికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందనేది చిత్ర దర్శకుడి ఆలోచన. ఈ విషయంపై సురేందర్ రెడ్డి...హీరో వద్ద నుండి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడని అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. ఇక చరణ్ లుక్స్ తో పాటు విలన్ రోల్ చేస్తున్న అరవింద్ స్వామి పాత్ర సైతం  ఈ సినిమాకి హైలైట్ మారుతుందని అంటున్నారు.


సెప్టెంబర్ 5వ తేదీ ఈ మూవీ టాకీ పార్ట్ ని పూర్తి చేసుకోనుందని అంటున్నారు. ఆ తరువాత పాటల చిత్రీకరణ ఉంటుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన 50 శాతం పనులు పూర్తయ్యాయని చిత్ర యూనిట్ నుండి తెలుస్తున్న టాక్స్. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తామని అన్నారు. ఇక చరణ్ మూవీ 'ధ్రువ' లో భారీ మార్పులు జరగటంతో అటు ఫ్యాన్స్ సైతం తెగ ఆసక్తి చూపుతున్నారు.


తమిళ వెర్షన్ తని ఒరువన్ మూవీకి  ఏ మాత్రం తగ్గకుండా 'ధ్రువ' సక్సెస్ ని సాధిస్తుందని ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం. రామ్ చరణ్ సైతం ఈ మూవీ సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 'ధ్రువ' మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని సెప్టెంబర్ 2వ వారం నుండి అగ్రెసివ్ గా స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తన సొంత మూవీ 'ధ్రువ' షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు సొంత ప్రొడక్షన్ లో రానున్న ఖైదీనెంబర్ 150 చిత్రానికి సంబంధించిన పనులను సైతం చూసుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: