రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'ధ్రువ'. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. దీంతో తన అప్ కమింగ్ మూవీకి సంబంధించి కథా చర్ఛలను ఇప్పటికే చరణ్ ప్రారంభించాడు. పలువురు క్రేజీ డైరెక్టర్స్ రామ్ చరణ్ తేజ్ కి కథలను చెబుతున్నారు. వాటిలో డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఒకరు. రీసెంట్ గా మేర్లపాక గాంధీ చెప్పిక ఓ కథకి రామ్ చరణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది.


ఇక ధ్రువ మూవీ అనంతరం రామ్ చరణ్ తేజ్ నటించబోయే చిత్రం సైతం డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లోనే ఉంటుందని అంటున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ టైటిల్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా వినిపిస్తుంది. ధ్రువ మూవీ అనంతరం రామ్ చరణ్ చేయబోయే చిత్రానికి 'మెగా ఎక్స్ ప్రెస్' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా వినిపిస్తుంది. గతంలో మేర్లపాక గాంధీ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' ని తెరకెక్కించాడు.


తరువాత 'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమానికి విజాయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో ఎక్స్ ప్రెస్ అనేది వచ్చే విధంగా మెగా ఎక్స్ ప్రెస్ అనే టైటిల్ ని డైరెక్టర్ కన్ఫర్మ్ చేశాడని అంటున్నారు. అయితే రామ్ చరణ్ తేజ్ మాత్రం ఇందుకు సముఖతగా లేడని అంటున్నారు. మెగా ఎక్స్ ప్రెస్ టైటిల్ అంత డీసెంట్ గా లేదని చరణ్ అభిప్రాయంగా తెలుస్తుంది. ఇప్పటికే స్టోరీ లైన్ ని ఓకే చేసుకున్న మేర్లపాక గాంధీ, పూర్తి స్క్రిప్ట్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.


రామ్ చరణ్ తేజ్ సైతం గాంధీ దర్వకత్వంలో వచ్చే సినిమా తరువాత సుకుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు. మొత్తంగా డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఫిక్స్ అయిన మెగా ఎక్స్ ప్రెస్ టైటిల్ కి రామ్ చరణ్ తేజ్ బ్రేక్ లు వేయటంతో...వీరి కాంబినేషన్ కి కొత్త టైటిల్స్ ని వెతికే పనిలో ఉంది చిత్ర యూనిట్. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయని అంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ధ్రువ దసర పండుగ సందర్భంగా థియోటర్స్ ని హిట్ చేయనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: