యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న మూవీ జనతా గ్యారేజ్ ఈ సంవత్సరం రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీలో ఒకటిగా ఉన్న జనతా గ్యారేజ్ రిలీజ్ దగ్గర పడుతున్న ఈ సమయంలో ఓ రోజు ముందు రిలీజ్ అని తెలియడం ఫ్యాన్స్ ను ఆనంద పరచినా సెప్టెంబర్ 1 అమావాస్య బ్యాడ్ సెంటిమెంట్ సినిమా యూనిట్ ను కంగారు పెట్టిస్తుంది. 


సినిమా వాల్లకున్న సెంటిమెంట్స్ అన్ని ఇన్ని కావు.. అయితే గ్యారేజ్ విషయంలో ముందు అనుకున్న సెప్టెంబర్ 2న భారత్ బంద్ కు పిలునివ్వడంతో చేసేదేం లేక ఇంకా సినిమా గురించి ఆడియెన్స్ ను వెయిట్ చేయించడం ఇష్టం లేక ఓ రోజు ముందే రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే తెలిసి చేశారా లేక తెలియక చేశారో కాని అమావాస్య రోజు గ్యారేజ్ రిలీజ్ చేస్తున్నారు.


అయితే సినిమా సెంటిమెంట్ ప్రకారం ఈ బ్యాడ్ సెంటిమెంట్ నుండి తప్పించుకునేందుకు తన సన్నిహితులతో ఓ ప్రీమియర్ షో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాడు జూనియర్. ఇలాంటి సందర్భాల్లో ప్రీమియర్ షో మొదటి షోగా లెక్కించి అమావాస్య ఎఫెక్ట్ తమ సినిమా మీద పడకుండా చేసుకునే హీరోలు చాలామందే ఉన్నారు.


ఇప్పుడు అదే క్రమంలో ఎన్.టి.ఆర్ కూడా జనతా గ్యారేజ్ సెన్సార్ పూర్తయిన వెంటనే సినిమా రిలీజ్ కు ఓ రోజో లేక రెండు రోజుల ముందో అంటే 31న గాని, 30న గాని ప్రీమియర్ వేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ట్రైలర్ సాంగ్స్ తో సినిమా మీద అంచనాలను పెంచేసిన కొరటాల శివ జూనియర్ ను నేచర్ లవర్ గా అద్భుతమైన పాత్ర డిజైన్ చేశాడు.


ఇక రిలీజ్ ఏ డేట్ అన్నది కాదు సినిమా బాగుందా లేదా అన్నది విషయం మీదే కలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే భారీగా బిజినెస్ జరిగిన ఈ సినిమా తారక్ కెరియర్ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని అంటున్నారు. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: