ఈ మాటలు అంటుంది ఎవరో కాదు ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బింధువుగా ఉండే నిర్మాద సి. కళ్యాణ్.  తెలంగాణలో కరడు గట్టిన నేరస్తుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత ఎన్నో నిజాలు బయట పడుతున్నాయి. ఇప్పటి వరకు నయీమ్ కేవలం రియల్ ఎస్టేట్, పెద్ద వ్యాపారస్తులు ను బెదిరించడం, ల్యాండ్ మాఫియా, భూ కబ్జాలు చేస్తూ..ఇవ్వని వారిని బెదిరిస్తూ డబ్బులు వసూళ్లు చేసినట్లు తెలిసింది. అంతే కాదు కొంత మంది అమ్మాయిలను విదేశాలకు పంపించి డబ్బులు సంపాదించేవాడని కూడా వార్తలు వచ్చాయి.  నయీమ్ వెనుక బడా బాడులు, పోలీస్ బాసులు, పొలిటికల్ సపోర్ట్ ఉందని ఎన్నో సంచలన కథనాలు వస్తున్నాయి. అంతే కాదు నయీమ్ హస్తం తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉన్నట్లు ఆయన బారిన పడ్డ నిర్మాతలు, నటులు కూడా చాలా మంది ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు నిర్మాత నట్టి కుమార్.
Image result for nayeem
అంతే కాదు ఏపీలో మంత్రిగా వ్యవహరిస్తున్న అచ్చెన్నాయుడు పై కూడా ఆరోపణలు చేశారు. అయితే వీటిపై స్పందించిన తెలుగు నిర్మాత మండలి ఇప్పుడునట్టి కుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ వాళ్లతో నయీమ్ కి ఎలాంటి సంబంధాలు లేవని అంటున్నారు. నట్టికుమార్ చేస్తున్నవన్నీ అవాస్తవాలు అన్నారు. తాజాగా ఈ విషయంపై సి. కళ్యాన్ స్పందిస్తూ..నిర్మాత నట్టికుమార్ ఓ పిచ్చి కుక్క అని మూడేళ్ళ క్రితం ఈ పిచ్చికుక్క ఇలాగే వాగితే ప్రెస్ క్లబ్ లో తగిన శాస్తి చేసామని ఇప్పుడేమో మళ్ళీ పిచ్చి లేచినట్లుంది వర్షాలు పడ్డాయి కదా వాడికి మళ్ళీ తగిన బుద్ది చెబుతామని అంటున్నాడు.  

Image result for natti kumar


నయీం తో కళ్యాణ్ తో పాటు మరికొంతమంది కి సంబంధాలు ఉన్నాయని నట్టికుమార్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నట్టికుమార్ పై సంచలన ఆరోపణలు చేసాడు సి. కళ్యాణ్ .  అసలు నయీమ్ కాదు నట్టికుమార్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నింటికీ దురమై సినిమా ఇండస్ట్రీ ఛీ కొట్టిందని అందుకే అసహనంతో ఏవో మాట్లాడుతున్నారని అన్నారు. వాడ్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే అసలు వాస్తవాలు బయట పడతాయని , నట్టికుమార్ ని వదిలేది లేదని వాడు ఎక్కడెక్కడ మోసాలు చేసాడో అన్ని బయట పెడతామని తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు సి. కళ్యాణ్.


మరింత సమాచారం తెలుసుకోండి: