తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సంచలన విజయాలు సాధించిన స్టార్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 150 వ చిత్రం షూటింగ్ బిజీలో ఉన్నారు. ఆగస్టు 22 న ఆయన పుట్టిన రోజున ఫస్ట్ లుక్ ‘ఖైదీ నెంబర్ 150’ విడుదల చేశారు. గత రెండు సంవత్సరాలుగా ఊరిస్తూ వస్తున్న చిరంజీవి మొత్తానికి తమిళ సూపర్ హిట్ చిత్రం కత్తి రిమేక్ తెలుగు నేటివిటీకి తగ్గ విధంగా తీర్చి దిద్దారు. ఈ చిత్రంలో పవన్ సరసన ఇప్పటి వరకు హీరోయిన్లు త్రిష, నయన తార, అనుష్క లను తీసుకోవాలనుకున్నా వారు వేరే చిత్రాల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు..పోనీ బాలీవుడ్ బ్యూటీలను ఫాలో కాగా అక్కడ కూడా ఇదే సమాధానం రాగా లాభం లేదనుకున్న సమయంలో మెగా ఫ్యామిలీతో ఇప్పటికే రాంచరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాన్ తో నటించిన కలువ కళ్ల సుందరి కాజల్ హీరోయిన్ గా తీసుకోవాలని నిశ్చయించారట. అయితే ఇదే సందు అనుకొని ఈ అమ్మడు రెమ్యూనరేషన్ డబుల్ చేసినా తప్పదని ఒప్పుకోని చిరంజీవి ‘ఖైదీ నెంబర్150 ’ కి హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.
తాజాగా 'ఖైదీ నంబర్ 150' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారు శంషాబాద్ విమానాశ్రయంలో జరుగుతోంది. చిరంజీవి-కాజల్ జంటపై కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ హీరోలతో నటించాను..కానీ అసలు మెగా ఫ్యామిలీకే పెద్ద హీరో చిరంజీవితో చాన్స్ వస్తుందని అస్సులు ఊహించలేదని అన్నారు. ఇప్పటి వరకు చిరంజీవి సినిమాలు చూశానని అంత పెద్ద లెజెండ్ సరసన నాయికగా నటించడం అమేజింగ్ అనిపిస్తోంది.ఇంత మంచి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఇప్పుడు షూటింగులో పాల్గొనడం ఎగ్జైటింగ్గా ఉంది. ఈరోజు నాకు ఫస్ట్ డే షూటింగ్. వచ్చే షెడ్యూల్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది కాజల్. వివివినాయక్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రాఫర్. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ 50 శాతం షూటింగ్ పూర్తయింది.