తెలుగు ఇండస్ట్రీలోకి హ్యాపీడేస్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్న మిల్కీ బ్యూటీగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోల సరసన నటించి మురిపిందింది. అంతే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా నటించింది..గత సంవత్సరం బాహుబలి చిత్రంలో అవంతికగా అంది హృదయాలు కొట్టేసింది. తెలుగులో నటించింది తక్కువే అయినా ఈ మిల్కీ బ్యూటి అందరికి మంచి ఫెవర్ ఉంది..ఒకప్పుడు నాగేశ్వరరావు 100% లవ్ చిత్రం ఆడియో వేడుకలో ఇప్పటికీ నేను మేకప్ వేసుకొని ఈ అమ్మాయి పక్కన డ్యాన్స్ చేయాలనిపిస్తుంది అని తమన్నా అందాన్ని పొగిడారు..తర్వాత చిరు కూడా తన 150 వ చిత్రంలో తమన్నాతో చేస్తే బాగుంటుంది అని రచ్చ ఆడియో వేడుకలో అన్నారు.
ఇలా పెద్ద హీరోల మనసు గెలుచుకున్న ఈ అమ్మడు రీసెంట్ గా ఊపిరి చిత్రంలో మరోసారి తన అందాలు చూపించి కుర్రకారు మనసు దోచింది. తాజాగా ఈ అమ్మడికి చెందిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఓ స్టేజీ పై అందరూ చూస్తుండగానే బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ బుగ్గపై ముద్దుపెట్టి షాక్ ఇచ్చింది. ఈ సంఘటన ఇటీవల జరిగిన వేడుకలో జరిగింది. రణ్ వీర్ సింగ్ తో కలిసి తమన్నా ఓ యాడ్ ఫిలిం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ యాడ్ ప్రమోషన్ లో భాగంగా రణవీర్ సింగ్ డ్యాన్స్ చేస్తూ కింద పడిపోయాడు..అంతే తమన్నా ఒక్కసారే వంగి అతని బుగ్గపై ముద్దు పెట్టింది.
మిల్కీ బ్యూటీ అందరి ముందు రణ్ వీర్ సింగ్ కు ముద్దు పెట్టడం సంచలనమే అయ్యింది . రణ్ వీర్ సింగ్ - తమన్నా లు చైనా నూడుల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ యాడ్ ఫిలిం తెలుగు , తమిళ , హిందీ , కన్నడ , మలయాళ భాషలలో రూపొందింది .