యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అనుకోని సంఘటనలు తనను కన్ ఫ్యూజన్ లో పడేస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న జూనియర్ ఆ సినిమా ఫలితం మీద కాస్త కంగారుగా ఉన్నాడు. అయితే ఈ టైంలో జూనియర్ కు షాక్ ఇస్తూ మలయాళ డిస్ట్రిబ్యూటర్స్ జనతా పోస్టర్ మీద అసలు తారక్ ను లేకుండా చేస్తున్నారట.


గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ ను పెట్టాలన్న ఆలోచన రాగానే ఆయనతో మాట్లాడటం ఒప్పించడం అంతా జరిగింది. అయితే ఎలాగు మలయాళ సూపర్ స్టార్ నటిస్తున్నాడు కాబట్టి సినిమాను మలయాళ వర్షన్ కూడా భారీగానే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు దర్శకుడు కొరటాల శివ. అక్కడ స్టార్ట్ అయ్యింది అసలు చిక్కు. 


మోహన్ లాల్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు సినిమా మొత్తం ఉన్నా అందులో హీరో మాత్రం మన యంగ్ టైగర్. కాని మలయాళంలో సీన్ వేరేలా ఉంది. అక్కడ జూనియర్ ను హీరోగా కాకుండా మోహన్ లాల్ ను హీరోని చేసేస్తున్నారు. సినిమా రిలీజ్ అవుతున్న ఈ సందర్భంలో మలయాళంలో కనిపిస్తున్న పోస్టర్స్ కూడా కేవలం ఫోకస్ మొత్తం మోహన్ లాల్ మీదే పెట్టడం ఆశ్చర్యంగా ఉంది.  


అయితే ఇదంతా డిస్ట్రిబ్యూటర్లు తమ లబ్ధి కోసం చేస్తున్న మ్యాజిక్. వాల్ పోస్టర్స్ అన్నిటిలో మోహన్ లాల్ ను హైలెట్ చేస్తే ఇది ఓ విధంగా ఎన్టీఆర్ కు అవమానం అన్నట్టే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానిని వినోద్ ను చంపిన అక్షయ్ కుమార్ తన అభిమాని అని తెలిసి దుఖంతో ఉన్న ఎన్.టి.ఆర్ కు జనతా గ్యారేజ్ మలయాళ డిస్ట్రిబ్యూటర్స్ చేస్తున్న చీప్ ట్రిక్స్ మరి తలనొప్పిగా మారాయి.


భారీ అంచనాలతో రాబోతున్న జనతా గ్యారేజ్ ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతుంది. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: