టాలీవుడ్ లో నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో పరపతి సంపాధించిన దిల్ రాజ్ ప్రముఖ హీరోలందరితోను సినిమాలు తీస్తున్న నిర్మాత. ఈమధ్య కాలంలో దిల్ రాజ్ టాప్ హీరోలతో సినిమాలను తగ్గించి యంగ్ హీరోలతో సినిమాలను చేస్తూ తన వేగాన్ని మరింత పెంచాడు.
సినిమా కథ విషయంలో నటీనటుల ఎంపిక విషయంలో ఎటువంటి ఖంగారు పడకుండా చాల వ్యూహాత్మకంగా సినిమాలు తీసే దిల్ రాజ్ ఆర్ధిక పరిస్థితి పై అటు ఫిలింనగర్ లోను ఇటు సోషల్ మీడియాలోను హడావిడి చేస్తున్న కొన్ని వార్తలను చూసి చాలామంది షాక్ అవుతున్నారు. అయితే దిల్ రాజు వ్యతిరేకులు కొందరు కావాలని దిల్ రాజ్ పై బురద జల్లడానికి ఈ రూమర్స్ ప్రచారంలోకి తీసుకు వచ్చారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అయితే ఈ గాసిప్పులు ఇలా ఫిలింనగర్ లో హడావిడి చేయడానికి ఒక కారణం ఉంది. నిన్న హైదరాబాద్ లో శర్వానంద్ హీరోగా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ‘శతమానంభవతి’ దిల్రాజు కార్యాలయంలో ప్రారంభమైంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తపు సన్నీ వేసానికి ప్రముఖ ఫైనాన్షియర్ సత్యరంగయ్య క్లాప్ కొట్టగా, సత్య రంగయ్య మనవడు రంగ యశ్వంత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. సత్య రంగయ్య తనయుడు ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. దీనితో దిల్ రాజ్ ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఒక సినిమా సెలెబ్రెటీని కాకుండా ఒక ఫైనాన్షియర్ కుటుంబం చేత సినిమా ప్రారంభోత్సవం చేయించాడు ఏమిటి ? అన్న గుసగుసలు వినిపించాయి.
ఈ గుసగుసలు రూమర్లుగా మరి దిల్ రాజ్ ఆర్ధిక పరిస్థితి బాగాలేదు అన్న గాసిప్పులు ఫిలింనగర్ లో షోషల్ మీడియాలో హడావిడి చేయడం మొదలు పెట్టాయి. ఈ మద్య కాలంలో దిల్ రాజ్ తీసిన కొన్ని సినిమాల ఫలితాలు దిల్ రాజును ఆర్థికంగా దెబ్బతీసాయని దీంతో ఫైనాన్షియర్ల వద్ద అప్పు చేసి సినిమా తీస్తున్నాడనే గాసిప్పులు రావడం చాలామందికి షాక్ ఇచ్చింది.
ఇది ఇలా ఉండగా సెప్టెంబర్ 14 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి నవంబర్ కు పూర్తి చేసి ఈ సినిమాను జనవరి14న విడుదల చేస్తున్నామని దిల్ రాజు ప్రకటించడం మరింత ఆశ్చర్యకరంగా మారింది. రాబోతున్న సంక్రాంతికి బాలకృష్ణ చిరంజీవి నాగార్జునల సినిమాల మధ్య టాప్ వార్ జరగబోతున్న నేపధ్యంలో శర్వానంద్ లాంటి చిన్న హీరో నటించిన సినిమాను ఏ ధైర్యంతో దిల్ రాజ్ విడుదల చేస్తున్నాడు అని అంటూ టాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి..