సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఫిల్మ్ కెరీర్ ని లీడ్ చేస్తున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ బిజిగా మారింది. చిన్న చిన్న ఆఫర్స్ తో ఏకంగా స్టార్ హీరోల సరసన నటించేందుకు రెడీ అయింది. ఇదిలా ఉంటే తాజాగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి భారీ ఎత్తున ఆఫర్స్ ఈ అమ్మడిని వరిస్తున్నాయి.

ఇప్పటికే ఓ తమిళ చిత్రానికి డేట్స్ ఇచ్చింది. విశాల్ హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో రూపొందే 'తుప్పారివాలన్' చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎన్నికైందని అంటున్నారు. తమిళంలో రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని చిత్రాలు చేసినప్పటికీ...అవి ప్లాప్ ని ఇచ్చాయి. ఇప్పుడు తెలుగులో వరుస చిత్రాలు హిట్ కావటంతో...ఇదే తనకు తమిళంలో మార్కెట్ ని పెంచుకోవటానికి మంచి సమయం అని భావించింది.

అందుకే కోలీవుడ్ నుండి వస్తున్న భారీ ఆఫర్స్ కి ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. తాజాగా మెగాహీరో రామ్ చరణ్ సరసన మరో ఆఫర్ ని అందుకుంది. ఇప్పటికే ఈ బ్యూటీ చరణ్ తో ద్రువ మూవీలో నటిస్తుంది. ఈ మూవీ తరువాత మరో మూవీలో నటించేందుకు సైతం తనకి ఆఫర్ వచ్చింది. అయితే తను చరణ్ సరసన నటించేందుకు అంతగా ఇంట్రెస్ట్ లేదని చెప్పుకొచ్చింది. అందుకు కారణం అదే సమయంలో కోలీవుడ్ హీరో విజయ్ సరసన ఓ మూవీలో నటించాలని చెప్పుకొచ్చింది.

కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో విజయ్ సరసన ఆఫర్ అంటే ఎవరు మాత్రం కాదనగలరు. అందుకే తను చరణ్ తో ఇప్పటికే ఓ మూవీలో చేస్తుండటంతో...మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక విజయ్ తో చేయబోతున్న మూవీ వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయని అంటున్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ రెమ్యునరేషన్ సైతం నిర్మాతలకి అందుబాటులో ఉండే విధంగా ఉండటంతో..అందరూ ఈ బ్యూటీనే ప్రిఫర్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: