దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా పార్ట్-2 కు సంబందించిన ఓ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి మొదటి పార్ట్ తో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన జక్కన్న ఇప్పుడు ఆ చిత్రం కొనసాగింపునకు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో సినిమా మీద అంచనాలను భారీగా పెంచేస్తూ అసలకే మోసం వచ్చే పరిస్థితి కనబడుతుంది.


ఇక ఆరెఫ్సి నుండి వినిపిస్తున్న టాక్ ఏంటంటే సినిమాకు నాలుగు డిఫరెంట్ క్లైమాక్స్ లు ప్లాన్ చేస్తున్నారట. వాటిలో ఏది పర్ఫెక్ట్ అనిపిస్తే అది ఉంచి మిగతావి తీసేస్తారట. సినిమా మొత్తం పూర్తయ్యాక ఆ నాలుగు క్లైమాక్స్ ను ఒక్కొక్కటిగా చూసి వాటిలో ఏది బెస్ట్ అనిపిస్తుందో అది ఫైనల్ చేస్తారట. అయితే ఈ ఆలోచన కాస్త అభిమానుల్లో భయాన్ని తెప్పిస్తుంది.


ఏదో ఒకటి రెండు అంటే చెప్పలేం కాని ఏకంగా నాలుగు క్లైమాక్స్ అంటే ఒకవేళ ఉంచిన క్లైమాక్స్ కాకుండా ఇంకా మిగతా మూడు ఏవై ఉంటాయా అన్న రేంజ్ లో ఆడియెన్స్ ఆలోచింది పెట్టిన క్లైమాక్స్ కు సాటిస్ఫై అవ్వకపోవచ్చు. విజువల్ వండర్ గా అనిపించే ఈ నాలుగు క్లైమాక్స్ లను ఒకేసారి షూట్ చేస్తున్నారట. 


ప్రస్తుతం ఆ ముగింపు షూటింగ్ లోనే నిమగ్నమై ఉన్న చిత్రయూనిట్ వాటిని త్వరలోనే పూర్తి చేసుకుని మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకోనుంది. ఇప్పటికే అనుష్క దేవసేన సీన్స్ తగ్గించి అవంతిక తమన్నా సీన్స్ పెంచేస్తున్నారన్న న్యూసే అనుష్క అభిమానులకు షాక్ ఇచ్చింది. మరి ఇప్పుడేమో నాలుగు క్లైమాక్స్ అంటూ భయపెట్టిస్తున్నారు.


సినిమా అంతా హంగామా చేసి చివరకు ఏదన్నా తేడా జరిగితే మొదటి భాగానికి వచ్చిన గొప్ప పేరు మొత్తం ఈ సెకండ్ పార్ట్ తో పోతుంది. అయితే ఓటమెరుగని దర్శకుడు రాజమౌళి ఆలోచన విధానం మనకు ముందునుండి తెలుసు కాబట్టి బాహుబలి పార్ట్ 2 కూడా అద్భుతంగా ఉండేలా తీస్తాడు. ఇక ఏది ఫైనల్ క్లైమాక్స్ అవుతుందో అది కాకుండా మిగిలిన మూడు క్లైమాక్స్ లను సినిమా ఆడిన కొద్ది రోజుల తర్వాత యాడ్ చేస్తారని టాక్. 



మరింత సమాచారం తెలుసుకోండి: