సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉన్న తమన్న ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ ఫుల్ బిజిగా ఉంది.  తన చేతిలో బాహుబలి మూవీ ఉండటంతో...ఈ మూవీ కారణంగా తనకి ఇండియన్ మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. బాలీవుడ్ కి చెందిన ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీలు సైతం తమన్నని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే పలు చిత్రాలతో బిజిగా ఉన్న తమన్న, వెరీ రీసెంట్ గా తన అప్ కమింగ్ మూవీల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంది.


ఇప్పటి వరకూ తమన్న సాధరణ హీరోయిన్ లాగే షూటింగ్ కి వచ్చేది. ఇప్పుడు కొత్తగా ఒప్పుకుంటున్న చిత్రాలతో కొంత ప్రొటోకాల్ ని కోరుకుంటుంది. ప్రత్యేకమైన సర్వీస్ లను ఇందులో జాయిన్ చేసింది. తన వద్దకు వస్తున్న నిర్మాతలకి ఈ విషయాలను చెప్పుకువచ్చిందని అంటున్నారు. తనతో అగ్రిమెంట్స్ ని చేసుకునేటప్పుడు నిర్మాతలు కచ్ఛితంగా తను చెప్పిన వాటికి ఒప్పుకుంటేనే నటిస్తాను అని చెప్పుకువస్తుందట.


ముఖ్యంగా తమన్న కొత్తగా సవరించిన అగ్రిమెంట్స్ లో నిర్మాతలకి ఓ విషయం అస్సలు నచ్ఛలేదంట. తను ఏదైనా మూవీకి నటిస్తే...దానికి సంబంధించిన ప్రమోషన్స్ లో ఏ మాత్రం పార్టిసిపేట్ చేయనని చెప్పుకొచ్చింది. ప్రమోషన్స్ కి సపరేట్ గా ప్యాకేజ్ ఉంటుందనేది ఈ బ్యూటీ అగ్రిమెంట్స్ లో ఉంది. ఆడియో ఫంక్షన్స్ కి మాత్రం తను ఫ్రీగా వస్తానని...ఆ తరువాత ప్రత్యేకమైన ఇంటర్వ్యూలకి సంబంధించిన విషయంలో మాత్రం సపరేటు ప్యాకేజ్ ని ఉపయోగించుకోవాల్సిందే అంటూ చెప్పుకువచ్చింది.


దీంతో నిర్మాతలు హడలిపోతున్నారు. ఇప్పటికే తమన్నకి ఒక సినిమా ప్యాకేజ్ కింద కోట్ల రూపాయలను చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాంటిది మళ్ళీ ప్రమోషన్స్ కోసం సపరేట్ ప్యాకేజ్ అంటే దానికి కనీసం మరో 25 లక్షలను ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. ఇండస్ట్రీలో ఈ తరహా డిమాండ్ ని పెట్టే హీరోయిన్ ఒక్క నయనతార మాత్రమే. ఇప్పుడు నయనతారతో  పాటు తమన్న కూడ జాయిన్ అయిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: