స్టార్ హీరో అల్లుఅర్జున్ నటించిన సరైనోడు మూవీ తరువాత ఈ హీరో వెంటనే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అందుకు కారణం సరైన కథ లేకపోవటమే. అల్లుఅర్జున్ ఎప్పుడూ ఒక మూవీ షూటింగ్ దశలో ఉండగానే...మరో మూవీకి సంబంధించిన డిస్కషన్స్ ని ఫైనలైజ్ చేస్తూ ఉంటారు. అందుకే ప్రతి మూవీ రిలీజ్ అయిన వెంటనే మరోమూవీతో అల్లుఅర్జున్ బిజిగా మారుతుంటారు.

కానీ ఈసారి ‘సరైనోడు’ వంటి సూపర్ హిట్ తరువాత కాస్త టైం తీసుకొని మూవీని ప్లాన్ చేసుకున్నారు. ఈ గ్యాప్ లో ఎందరో డైరెక్టర్స్ వచ్చి అల్లుఅర్జున్ కి కథలని చెప్పారు. ఏ కథ అల్లుఅర్జున్ కి నచ్ఛలేదు. దీంతో దిల్ రాజు తన ప్రొడక్షన్ హౌస్ నుండి కథ వినిపించారు. అయితే ఆ కథకి ఓకె చెప్పిన బన్నీ..దిల్ రాజు సజెస్ట్ చేసిన డైరెక్టర్ కి మాత్రం నో చెప్పారనేది ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్స్.

ఆ డైరెక్టర్ ఎవరో కాదు హరీష్ శంకర్. గత కొద్ది కాలంగా డైరెక్టర్ హరీష్ శంకర్ తన మూవీల విషయంలో వెనకబడి ఉన్నాడు. రామయ్య వస్తావయ్యా తరువాత మూవీలు చేసినప్పిటికీ...తనకి అవకాశం ఇవ్వటానికి ప్రముఖ హీరోలు ఎవ్వరూ ముందుకు రావటం లేదు. ఈసారి మాత్రం నిర్మాత దిల్ రాజు ఇచ్చిన హామితో డైరెక్టర్ హరీష్ శంకర్ తో మూవీకి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అందుకే ఇండస్ట్రీ ఈ కాంబినేషన్ గురించి "డైరెక్టర్ కి షాక్..ప్రొడ్యూసర్ కి స్వీట్" అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ కాంబినేషన్ మూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయింది. రేపు హైద్రాబాద్‌లో ఈ మూవీ వైభవంగా లాంచ్ కానుంది. హరీష్ శంకర్, బన్నీ కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్టుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: