సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డెబ్యూ హీరోగా నిఖిల్ కుమార్ గౌడ ఎంట్రీ ఇవ్వనున్నారన్న సంగతి తెలిసిందే. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ తన కుమారుడు నిఖిల్ కుమార్ గౌడని సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేస్తున్నారు. హై ప్రొఫైల్ ఫ్యామిలీ నుండి వస్తున్న హీరో కావటంతో ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ సైతం భారీగానే ఉంటుంది. దాదాపు 75 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.


ఈ మూవీకి మహదేవ్ దర్శకత్వం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కుమారుడు నిఖిల్ కుమార్ గౌడ నటించిన తొలి చిత్రం కావటంతో...దీనికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రొడక్షన్ రిచ్ గానే ఉంది. ఈ మూవీని కర్ణాటక, తెలుగు..తరువాత తమిళ రాష్ట్రాలలో రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఆడియో వేడుక సెప్టెంబర్ 18న హైదరాబాద్  నోవాటెల్ హోటల్ లో వైభవంగా జరుగుతుంది.


ఈ ఫంక్షణ్ కి పవన్ కల్యాణ్ హాజరు కావటం విశేషం. ఇప్పటికే వరకూ నిఖిల్ కుమార్ గౌడ నటించిన జగ్వార్ మూవీకి పవన్ కళ్యాణ్ వస్తారు అనే సమాచారం పక్కాగా ఉంది. కానీ ఆడియో విడుదల రోజు పవన్ కళ్యాణ్ వస్తారా? లేదా? అనేది డౌట్ కూడ ఉంది. పవన్ కళ్యాణ్ ని ఆడియో ఫంక్షన్ కి  కచ్ఛితంగా తీసుకురావాలి అనేది హీరో నిఖిల్ కుమార్ గౌడ నిర్ణయం. ఈ విషయంలో నిఖిల్ కుమార్ గౌడ కొంత టెన్షన్ లో ఉన్నారంట. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఫంక్షన్ కి రాకుండా ఉంటారేమో అనే టెన్షన్ లో...ప్రతి రోజు పవన్ కళ్యాణ్ కి చెందిన అప్ డేట్స్ ని ఫాలప్ చేయిస్తున్నాడు.


ఈ మూవీని తెలుగులోనూ భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే...తాజా పరిణామాలతో పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా బిజిగా మారే అవకాశం ఉంది. దీని కారణంగా జాగ్వార్ మూవీ ఆడియో ఫంక్షన్ కి హాజరు అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చనేది ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇక జాగ్వార్ మూవీలో శ్రుతిహాసన్ సైతం స్పెషల్ సాంగ్ చేయనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: