జూనియర్ ఎన్టీఆర్ ఈవారం విడుదల కాబోతున్న తన ‘జనతా గ్యారేజ్’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ వీరాభిమాని వినోద్ రాయల్ హత్య పై స్పందించాడు. వినోద్ ను కత్తితో పొడిచి చంపిన ఆ వ్యక్తి జూ.ఎన్టీఆర్ అభిమానిగా వార్తలు వస్తున్న నేపధ్యంలో జూనియర్ చాల వ్యూహాత్మకంగా స్పందించాడు.
హద్దులు దాటే అభిమానులు తనకు వద్దని అదేవిధంగా తన పై మితిమీరిన అభిమానం తనకు అవసరం లేదని ఎవరైనా మొదట మనం పుట్టిన ఈ భూమి పైన, దేశం పైనా, ఆ తర్వాత తల్లిదండ్రుల మీద, భార్యా పిల్లల మీద, శ్రేయోభిలాషుల మీద ప్రేమను చూపించాలని ఆ తరువాత మాత్రమే హీరోగా తానును ప్రేమించమని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు జూనియర్.
అంతేకాదు తనకు ఏ హీరో తోను భేదాభిప్రాయాలు లేవు అని అంటూ తనకు లేని మితిమీరిన కోపాలు తన అభిమానులకు ఎందుకు అంటూ కామెంట్స్ చేసాడు. అభిమానుల ప్రేమ వల్లే తాను ఈ స్థానంలో ఉన్న విషయం తనకు తెలుసు అనీ అయితే హద్దులు దాటే మితిమీరిన అభిమానం తనకు వద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
‘ముందు దేశం, తర్వాత కుటుంబం, ఆ తర్వాతే సినీ హీరోలపై అభిమానం’ అంటూ టాలీవుడ్ లో తనకు ఏ హీరోతోను గొడవలు లేవని భవిష్యత్తులోనూ హీరోల మధ్య ఎలాంటి గొడవలు ఉండబోవని స్పష్టం చేసాడు జూనియర్. దీనితో ఈ వ్యవహారం పై ఇప్పటి వరకు జూనియర్ ఎందుకు స్పందించడం లేదు అని కామెంట్స్ చేసిన వారికి జూనియర్ చాల తెలివిగా సమాధానం చెప్పినట్లు అయింది.
ఈ వార్తలు ఇలా ఉండగా ఈ వారం విడుదల కాబోతున్న ఈ వారం విడుదల కాబోతున్న ‘జనతా గ్యారేజ్’ సినిమాకు కొన్ని సీన్స్ని రీ-షూట్ చేస్తునారు అని ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న వార్తలు చాలామందికి షాక్ ఇస్తున్నాయి. సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడ పూర్తి అయిన తరువాత ఇప్పుడు రీ రీషూట్ ఏమిటి అని చాలామంది విస్తుపోతున్నారు.
అయితే ఈసినిమా యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ ప్రమోషనల్ వీడియో కోసం షూట్ చేస్తున్నామే తప్ప.. కొన్ని సీన్స్ను రీ షూట్ చేయడం లేదని ఈ సినిమా యూనిట్ వివరణ ఇస్తున్నట్లు టాక్. ఏదిఎమైన సెప్టెంబర్ 1వ తారీఖు కోసం జూనియర్ అభిమానులు అంతా ఆత్రంగా వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు..