మలయాళ భామల తాకిడి టాలీవుడ్లో ఎంత ఉందో అందరికి తెలిసిందే. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ లో సగం మంది కేరళ నుండి వచ్చి తెలుగు ఆడియెన్స్ మనసు గెలిచిన వారే. అయితే ఇప్పుడు మరో భామ అందుకు సిద్ధమైంది. ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ సినిమా ఇక్కడ రీమేక్ లో తన రోల్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా త్రివిక్రం సెల్యులాయిడ్ నుండి వచ్చిన అఆలో అదరగొట్టింది.


ఇక మనం మాట్లాడేది ఎవరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటా. అనుపమా పరమేశ్వరన్ ప్రేమంతో పాపులర్ అయిన ఈ బ్యూటీ తెలుగులో అఆతో ఎంట్రీ ఇచ్చింది ఇక తెలుగు ప్రేమంలో చైతుతో రొమాన్స్ కు సిద్ధమైంది. అందం అభినయం అన్ని కలగలిపిన ఈ అమ్మడు అఆలో చేసింది చిన్న పాత్రే అయినా అందరికి తెగ నచ్చేసింది.


అందుకే ఆ మెప్పు గమనించిన దిల్ రాజు తనకు హీరోయిన్ గా క్రేజ్ తెచ్చేందుకు శతమానం భవతి సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. శర్వానంద్ హీరోగా సతీష్ వేగ్నేశ డైరక్షన్లో రూపొందబడుతున్న ఈ సినిమా మళ్లీ దిల్ రాజు బ్యానర్లో బొమ్మరిల్లు సినిమాకు వచ్చినంత పేరు తెస్తుందని చిత్రయూనిట్ చెబుతున్నారు.


రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ సెప్టెంబర్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూట్ చేయనున్నారు. అనుపమా పరమేశ్వరన్ కు ఇదే మొదటి సోలో సినిమా అని చెప్పాలి. ఇక తన లాస్ట్ మూవీ ఎక్స్ ప్రెస్ రాజా హిట్ తో జోష్ లో ఉన్న శర్వానంద్ మరోసారి ఈ సంక్రాంతికి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.


ఇక దిల్ రాజు ఈ సినిమా ఓపెనింగ్ రోజే సంక్రాంతి రిలీజ్ అని చెప్పేశాడు. దిల్ రాజు అంత నమ్మకంతో చెప్పాడు అంటే సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని టాక్. మరి సంక్రాంతి బరిలో ఇప్పటికే బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ ఫిక్స్ చేయగా చిరు ఖైది నెంబర్ 150 కూడా ఆ టైంలోనే వచ్చేట్టు ఉంది. మరి ఆ సినిమాలకు పోటీగా దీన్ని వదలాలని చూస్తున్న దిల్ రాజు గట్స్ చూస్తుంటే సినిమాలో మంచి విషయం ఉన్నదనే అనిపిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: