మెగా కుటుంబ వీరాభిమానిగా పేరు గాంచిన బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను బాస్ అంటూ అనేక సార్లు పిలిచి తన వీరాభిమానాన్ని బయట పెట్టిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి.  పవన్ కళ్యాణ్ తో మాత్రమే కాకుండా అల్లు అర్జున్ రామ్ చరణ్ లతో కూడ సినిమాలను తీసి చిరంజీవి 150వ సినిమాకు కనీసం సహా నిర్మాతగా అయినా వ్యవహరించాలని ఎన్నో ప్రయత్నాలు చేసాడు బండ్ల గణేష్.

ప్రస్తుతం పరిస్థుతులు ఏమి కలిసి రాకుండా పోతూ ఉండటంతో తన ఫౌల్ట్రీ ఫామ్ లో కోడిగుడ్లను లెక్క పెట్టుకుంటూ కాలం గడుపుతున్న బండ్ల గణేష్ తిరిగి మెగా కుటుంబ అభిమానాన్ని ముఖ్యంగా పవన్ దృష్టిని ఆకర్షించడానికి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.  ఈ పరిస్థుతులలో మొన్న పవన్ నిర్వహించిన తిరుపతి బహిరంగ సభ మళ్ళీ బండ్ల గణేష్ ను వార్తలలోకి తీసుకుని వచ్చేలా చేసింది.

తిరుపతిలో పవన్ వేలాదిమంది తన అభిమానుల మధ్య ఆ వేసంగా మాట్లాడుతూ  “బతిమాలితే పనులు జరగవు, బలం చూపిస్తేనే జరుగుతాయి’ అన్న మాటలను బండ్ల గణేష్ కోట్ చేస్తూ  ‘యూ ఆర్ రైట్ బాస్’  అంటూ పవన్ కు మద్దతు తెలుపుతూ పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో ఒక పండు ముసలావిడ టివికి అతుక్కుపోయి, పవన్ మాటలను శ్రద్ధగా వింటున్న ఫోటోను తన ట్విటర్ లో పోస్ట్ చేసాడు.

ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడమే కాకుండా పవన్ వీరాభిమానులు ఈఫోతోను తమలో ఒకరికొకరు చేసుకుంటూ తమ హీరోకు ఉన్న ప్రజాబలానికి ఈ ఫోటో నిదర్శనమంటూ పండగ చేసుకుంటున్నారు. దీనితో పవన్ కళ్యాణ్ పుణ్యమా అని బండ్ల గణేష్ మళ్ళీ మీడియా వార్తలలో కనిపిస్తున్నాడు. 

ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ వ్యాఖ్యల పై ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు ఘాటుగా స్పందించారు. హోదా పైన పవన్ మాట్లాడటం సంతోషకరమన్నారు. అదే సమయంలో పవన్‌కు కౌంటర్ కూడ ఇచ్చారు. తాను ఎవరికీ భయపడటం లేదని చెప్పారు. ఇకముందు కూడా భయపడనని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు సీబీఐకి భయపడుతున్నారా అని పవన్ శనివారం ప్రశ్నించిన ప్రశ్నకు తనదైన శైలిలో జవాబు ఇస్తూ గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి తన పైన 25 కేసులు పెట్టినా భయపడలేదనే విషయాన్ని గుర్తుకు చేస్తూ ప్రత్యేక హోదా పైన రాజీపడే ప్రసక్తి లేదన్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: