యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ప్రస్తుత చిత్రం జనతా గ్యారేజ్. ఈ మూవీ సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. కచ్ఛితంగా ఈ సినిమా టాలీవుడ్ బాక్సాపీస్ ని షేక్ చేయటం ఖాయం అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్..ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. సహజంగా ఎన్టీఆర్ తన ప్రతి మూవీ రిలీజ్ కంటే ముందుగానే, తరువాత మూవీకి సంబంధించిన విషయంలో పక్కా క్లారిటీగా ఉంటాడు.


అందుకే జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించనున్నారు. ఇప్పటికే స్టోరికి సంబంధించిన తుది చర్ఛలు జరిగి, దీనిపై పూర్తి వర్కౌట్స్ ని డైరెక్టర్ చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావటంతో త్వరలోనే ఈ మూవీ లాంచింగ్ కి ముహుర్తం ఫిక్స్ చేసుకుంటుంది. ఇక ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించనున్నారు. కళ్యాణ్ రామ్ ఈ మూవీని భారీగా తెరకెక్కించనున్నారు.


అయితే సోదరుడు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ గట్టి షాక్ ఇచ్చాడని అంటున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మీద వస్తున్న ఈ మూవీని కళ్యాణ్ రామ్ దాదాపు 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం బడ్జెట్ కేవలం 45 కోట్ల రూపాయలలోపే ఉండాలని కచ్ఛితంగా చెప్పుకువచ్చారంట. ఇది విన్న కళ్యాణ్ రామ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.


బడ్జెట్ విషయంలో ఎన్టీఆర్ ఇంత కచ్ఛితంగా ఉండటం చూసి...ఓ నిర్మాతగా కళ్యాణ్ రామ్ ఆశ్ఛర్యపోయాడనే టాక్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ సైతం తన మూవీని ఓవర్ బడ్జెట్ తో తెరకెక్కించి...నిర్మాతలని ఇబ్భందుల్లో పడేయటం మంచిది కాదని అభిప్రాయపడుతున్నాడంట.



మరింత సమాచారం తెలుసుకోండి: