టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసింది రెండే సినిమాలే అయినప్పటికీ...ఆ హీరోయిన్ కి భలే డిమాండ్ క్రియేట్ అయింది. అందరి హీరోలు సైతం ఆ బ్యూటీ కాల్షీట్స్ కోసం క్యూలో ఉన్నారనే చెప్పాలి. అయితే తనకి ఇండస్ట్రీలో ఇంత మార్కెట్ ఉన్నప్పకీ...ఆ బ్యూటీ మాత్రం ఎవ్వరినీ లెక్కచేయకుండా బాలీవుడ్ కి చెక్కేసింది. తనే పూజా హెగ్డే. పూజా హెగ్డే కి సౌత్ మార్కెట్ లో స్టార్ డం వచ్చే సమయానికి బాలీవుడ్ మార్కెట్ కి వెళ్లటం...అక్కడ కూడ ఒక సినిమా కోసం దాదాపు 2 సంవత్సరాల సమయాన్ని వేస్ట్ చేయటం వంటివి తన ఫిల్మ్ కెరీర్ ని ఇబ్భందుల్లోకి నెట్టేసింది.


బాలీవుడ్ లో చేసిన హొహంజోదారో సినిమా మార్కెట్ లో ప్లాప్ కావటంతో...ఈ బ్యూటికి అంతగా పేరు రాలేదు. అయితే తెలుగులో 'ముకుంద' 'ఒక లైలా కోసం' వంటి సినిమాలను ఈ బ్యూటీ చేసింది. ఒక లైలా కోసం మూవీ బాక్సాపీస్ వద్ద మంచి సక్సెస్ ని సాధించటంతో...ఇతర టాప్ హీరోలు పూజా హెగ్డే ని హీరోయిన్ గా తీసుకోవాలని ప్రయత్నించారు.


కానీ అప్పటికే పూజా హెగ్డే బాలీవుడ్ లో వచ్చిన మోహంజోదారో మూవీ కోసం బిటౌన్ వెళ్లింది. ఆ మూవీ చేస్తూనే ఇతర మూవీల్లో నటించే విధంగా తనకు ఛాన్స్ ఉన్నప్పటీ...తెలుగులో వస్తున్న ఆఫర్స్ కి నో చెప్పింది. ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య తో మరోసారి హరోయిన్ గా ఆఫర్ వచ్చినప్పటికీ...ఈ బ్యూటీ నో అనేసిందట.


అయితే ప్రస్తుతం పూజా హెగ్డే కి ఆఫర్స్ అంతగా లేకపోవటంతో...తిరిగి నాగచైతన్యతో ఆఫర్స్ కోసం ఫోన్ చేసిందట. ఇంకేముంది...గతంలో తన మూవీకి హ్యాండ్ ఇచ్చిన పూజా హెగ్డే కి ఈ అక్కినేని హీరో ఫుల్ క్లాస్ పీకాడు. అయినప్పటికీ అవకాశాలు లేవు అంటూ చెప్పుకువచ్చాడని అంటున్నారు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీపై పెద్దగా ఆశలు పెట్టుకోకుండా మరోవైపు వ్యాపారం రంగంలోకి పూజాహెగ్డే దిగిందని చెప్పుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: