ఓ పక్క నటుడిగా చేస్తూనే మరో పక్క దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ తన ప్రతిభ చాటుతున్నాడు. ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా కొత్త టర్న్ తీసుకున్న శ్రీని ఇప్పుడు తన సెకండ్ మూవీ జ్యో అచ్యుతానందతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నారా రోహిత్, నాగ శౌర్య కలిసి నటిస్తున్న ఈ సినిమాలో రెజినా హీరోయిన్ గా నటించింది.


అయితే అసలు ఈ సినిమా చేస్తానని ముందు మాటిచ్చింది మాత్రం వేరే హీరోలట. కంచె సినిమా జార్జియాలో షూట్ చేసుకుంటున్న టైంలో తన చేతులు విరిగే సరికి హాస్పిటల్ పాలయ్యానని.. వీల్ చైర్ లో కూర్చొని ట్రీట్ మెంట్ కు సరిగ్గా మత్తుమందు ఇచ్చే సమయానికి తనకు ఈ సినిమా కథ వచ్చిందని అవసరాల శ్రీనివాస్ అన్నారు.


ఇక ఆ కథకు ముందు అనుకున్న హీరోలు వేరే అట. కథగా ఉన్నప్పుడు ఓకే చెప్పిన ఆ హీరోలు పూర్తి కథ అయ్యాక అడిగితే హ్యాండ్ ఇచ్చారట. ఆ విషయాన్నే గుర్తుతెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ ఇక ఆ తర్వాత నారా రోహిత్ కు చెప్పడం అతను ఓకే అనడంతో నాగ శౌర్యను కూడా తీసుకోవడం జరిగిందట. మరి అవసరాలను కాదన్న ఆ హీరోలెవరో తెలియాల్సి ఉంది.


ఇక హీరోయిన్ గా కూడా రెజినాను చివరి నిమిషంలో ఫైనల్ చేశాడట అవసరాల శ్రీనివాస్. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ రమణి మ్యూజిక్ అందించాడు. కథాబలంతో వస్తున్న ఈ సినిమా కేవలం లవ్ స్టోరీనే అందరు అనుకుంటున్నారు కాని అన్నదమ్ములుగా నటించిన రోహిత్, శౌర్యల మధ్య సీన్స్ ప్రేక్షకులకు నచ్చుతాయని నమ్మకంతో చెబుతున్నాడు.


తన టేస్ట్ ఏంటో ముందు సినిమాతోనే రుచి చూపించిన శ్రీని ఈ సినిమాకు అంత గట్టి నమ్మకంతో ఉన్నాడంటే సినిమా కచ్చితంగా ఇంప్రెస్ చేస్తుందని అనుకోవచ్చు. సెప్టెంబర్ సెకండ్ వీక్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: