స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా వచ్చిన సరైనోడుతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకున్నాడు. సినిమాలో బ్లాక్ బస్టర్ పాట పెట్టడమే కాదు సినిమానే బ్లాక్ బస్టర్ చేయించి చూయించిన బన్ని ప్రస్తుతం హరీష్ శంకర్ డైరక్షన్లో దువ్వాడ జగన్నాథం సినిమాకు కమిట్ అయ్యాడు. ముహుర్తం పెట్టుకున్న ఈ సినిమా షూట్ సెప్టెంబర్ మొదటి వారం నుండి జరుగనుంది.


అయితే సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఫేడవుట్ కు దగ్గర పడుతుంది అనుకున్న కాజల్ ను అటు చిరు 150వ సినిమా అదృష్టం వరించింది. ఇక ఎన్.టి.ఆర్ జనతా గ్యారేజ్ లో కూడా పక్కా లోకల్ అంటూ ఓ స్పెషల్ ఇటెం సాంగ్ చేస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ సరసన నటించేందుకు సై అంటుందట.


ఇప్పటికే ఆర్య-2 లో కలిసి నటించిన ఈ జంట చూసేందుకు ఓకే అనిపించేలా ఉన్నా బన్ని పక్కన కొత్త అందాన్ని చూడాలనుకునే వారికి ఇదో బ్యాడ్ న్యూస్ అవుతుంది. ఇక కాజల్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనను అల్లు అర్జున్ కాస్త దూరం పెట్టినా దిల్ రాజు కావాలని ఆమె కోసం బన్నిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడట.


ఇదంతా చూసి దిల్ రాజు ట్రాప్ లో బన్ని ఇరుక్కున్నాడనే అంటున్నారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బన్ని దిల్ రాజు లాంటి బడా ప్రొడ్యూసర్ తో సినిమా అంటే కొత్త అంచనాలతో కలర్ఫుల్ గా ఉంటుందని ఆశించారు. కాని కాజల్ హీరోయిన్ గా ఎంపిక చేసే ఆలోచనే ఫ్యాన్స్ ను కంగారులో పడేస్తుంది.


మరి దిల్ రాజు మాటలకు కవిన్స్ అయ్యి కాజల్ తో బన్ని జతకడతాడా లేక ససేమీరా కాదని అంటాడా అన్నది చూడాలి. ఇక ఈ ఇయర్ కాజల్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం రెండు ఫ్లాపులయ్యాయి ఆ బ్యాడ్ లక్ తో అయినా కాజల్ అంటే వామ్మో అనేస్తున్నారు సిని జనాలు. ఇవన్ని సమతూకం వేసుకునే దిల్ రాజు బన్నికి కాజల్ ఎలా హీరోయిన్ చేద్దామనుకున్నాడో మరి.  



మరింత సమాచారం తెలుసుకోండి: