ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరక్టర్స్ లో కొరటాల శివ ఒకరు. మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో సంచలన విజయాలను అందుకున్న కొరటాల శివ ఓ రచయిత దర్శకుడు అయితే ఎలాంటి ఫలితాలను అందుకోవచ్చో గట్టిగానే నిరూపించాడు. అయితే స్టార్ హీరోలేమో శివ వెంట పడుతుంటే కొరటాలను మాత్రం మెగా పవర్ స్టార్ రాం చరణ్ లైట్ తీసుకున్నాడట. మిర్చి హిట్ తో ప్రభాస్ ను మరో రేంజ్ కు తీసుకెళ్లిన కొరటాల శివ ఆ తర్వాత చరణ్ తో సినిమా కోసం ప్రయత్నం చేశాడట. కాని చెర్రి మాత్రం కొరటాలతో చేసేందుకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదట.


ఇక రెండో సినిమాగా సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడుగా మరో హిట్ ఇచ్చాడు. ఇక ఆ సినిమా తర్వాత తారక్ వదిలి పెట్టకుండా పిలిచి అవకాశమిచ్చాడు. అదే ఇప్పుడు జనతా గ్యారేజ్ గా రిలీజ్ అవుతుంది. ఇక గ్యారేజ్ రిలీజ్ అవుతున్న ఈ సందర్భంలో చెర్రితో సినిమా చేసేందుకు సిద్ధం అనే వార్తలొచ్చినా మళ్లీ కొరటాల శివను కాదనేశాడట చరణ్. అయితే కొరటాల శివ విషయంలో చరణ్ కావాలని చేస్తుంది కాపోయినా ఈ దర్శకుడు మాత్రం ఘోరంగా హర్ట్ అయ్యాడని ఫిల్మ్ నగర్ టాక్.


అంతేకాదు ఇక చెర్రి నుండి పిలుపొచ్చినా వెళ్లకూడదు అని గట్టిగా డిసైడ్ అయ్యాడట. కొరటాల తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీని షాక్ కు గురి చేస్తుంది. అయితే ఈ పట్టింపులు ఎన్నాళ్లని చెప్పండి ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తే ఏ దర్శకుడైనా ఎలాంటి హీరోకైనా కథ చెప్పాల్సిందే డైరక్షన్ చేయాల్సిందే. ప్రస్తుతం జూనియర్ తో చేసిన జనతా గ్యారేజ్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న కొరటాల శివ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. అంతేకాదు తన తర్వాత సినిమా మహేష్ తో ఉంటుందని తానే స్వయంగా ఎనౌన్స్ చేశాడు.


మహేష్ బాబు ఇప్పుడు మురుగదాస్ సినిమా షూట్లో ఉన్నాడు. ఆ తర్వాత ఎంతోమంది దర్శకులు వెయిట్ లో ఉన్నా సరే మళ్లీ కొరటాలతోనే డీల్ సెట్ చేసుకున్నాడు. అయితే ఆ కథ మాత్రం శ్రీమంతుడు-2 మాత్రం కాదని తెగేసి చెప్పేశాడు. మరి శ్రీమంతుడు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: