తెలుగు ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తులు మహానటులు ఎవరూ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్, ఏఎన్ఆర్. అయితే ఎన్టీఆర్ కన్నా ఏఎన్ఆర్ ఇండస్ట్రీలోకి ముందు వచ్చారు..కానీ ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేసిన అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన ప్రతిభతో విపరీతమైన పాపులారిటీ సంపాదంచారు.

అప్పట్లో పౌరాణిక, జానపద,సాంఘిక చిత్రాల్లో ఎలాంటి పాత్ర వేయాలన్నా ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే సూట్ అయ్యేలా ఉండేవట..అందుకే ఎన్టీఆర్ అంటే అప్పట్లో తోటి నటులే కాక దర్శక నిర్మాతలు కూడా ఎంతో గౌరవం ఇచ్చేవారట. ఇండస్ట్రీలో అప్పటికే స్థిరపడిపోయిన ఏఎన్ఆర్ అంటే ఎన్టీఆర్ కి చాలా గౌరవం అభిమానం అందుకే ఏ కార్యక్రమాల్లో అయినా సరే ఇద్దరు ఎక్కువగా పాల్గొనేవారట.

ఎప్పుడూ ఏఎన్ఆర్ ని ఎన్టీఆర్ ఏం బ్రదర్ ఎలా ఉన్నారు..అంటూ ఎంతో స్నేహపూర్వకంగా మందలించేవారట. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమకు ఇద్దరు రెండు కళ్లు అంటారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: