ఒకరు క్రికెట్ దేవుడు మరొకరు సినిమాల్లో టాప్ హీరోలు ఇక మరో ఇద్దరు టాప్ బిజినెస్ మేన్స్ వీరందరూ ఒకే చోట కలిస్తే ఎలా ఉంటుంది..అది కూడా డిఫరెంట్ గెటప్ లో దర్శనమిస్తే..అక్కడ పండుగ వాతావరణమే. సాకర్ టోర్నీ మూడో సీజన్ హంగామా మొదలైంది. గడిచిన రెండు సీజన్లు ఆడియన్స్‌ని పెద్దగా ఆకర్షించలేక పోయినా ఇప్పుడు దానికి కొత్త హంగులు అద్దుతున్నారు. టాలీవుడ్ స్టార్స్ నాగార్జున, చిరంజీవి, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌లు సాకర్‌లోకి అడుగుపెట్టేశారు. స్టార్ సెలబ్రిటీస్ అడుగువేయడంతో టోర్నీకి కళ వచ్చిందని చెప్పొచ్చు.  ఇండియన్ సూపర్ లీగ్ 2016(ఐఎస్‌ఎల్‌) టోర్నీ అక్టోబరు 1న ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఈ సీజన్‌లో కేరళ బ్లాస్టర్స్‌ కొత్త బృందాన్ని బుధవారం ప్రకటించారు.

ఈ సందర్భంగా జట్టు యజమానులైన సచిన్‌ టెండూల్కర్‌, చిరంజీవి, నాగార్జున, సినీ నిర్మాత అల్లు అరవింద్‌, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్.. జట్టు సభ్యులతో ప‌సుపురంగు జెర్సీ, లుంగీ ధ‌రించి అదుర్స్ అనిపించారు. ఇంత‌కుముందు కూడా వీరు క‌ల‌సి కొన్న కేర‌ళ బ్లాస్ట‌ర్స్ ఫుట్‌బాల్ టీమ్‌ను ప్ర‌మోట్ చేసే క్ర‌మంలో ఈ ముగ్గురు ఒక్క‌ట‌య్యారు.  
Image result for చిరు సచిన్
మోలీవుడ్ యంగ్ హీరో నివిన్‌ పౌలిని జట్టుకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కాగా, కోచ్‌గా స్టీఫెన్‌ కాంపెల్ నియమించింది. తొలిసారి సెలబ్రిటీలు ఇలా కనిపించడంతో సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. మొత్తానికి  జట్టు యజమానులు సచిన్‌ తెందుల్కర్‌, చిరంజీవి, నాగార్జున, సినీ నిర్మాత అల్లు అరవింద్‌, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌.మళయాల యువనటుడు నివిన్‌ పౌలిని జట్టుకు యూత్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: