నితిన్ కొత్త సినిమా ప్రారంభం
యంగ్ హీరో నితిన్ కొత్త సినిమా ప్రారంభం అయింది. దర్శకుడు హను రాఘవపూడితో చేయబోయే సినిమాను లాంచ్ చేశారు. హైదరాబాద్ లోని నిర్మాతల కార్యాలయంలో ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా .. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా .. ముహూర్తపు షాట్ ను దేవుడి పటాలపై చిత్రీకరించారు. రామ్ ఆచంట .. గోపీనాథ్ ఆచంట నిర్మిస్తోన్న ఈ సినిమా, డిఫరెంట్ లవ్ స్టోరీతో తెరకెక్కనుంది.
ఎన్టీఆర్ గ్యారేజ్ కు మరిన్ని సీన్లు యాడ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమా కొన్ని సీన్లను కలుపుతామని కొరటాల శివ ఇంతకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. బక్సాఫీసు వద్ద 'జనతా గ్యారేజ్' దుమ్మురేపుతుండటంతో పక్కన పెట్టిన సీన్లను మళ్లీ కలిపారు. సినిమాలో ఎలాంటి పరిచయం లేకుండా పాటతో ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా కలిపిన సీన్లలో ఇంట్రడక్షన్ సీన్ ఉంది. మొక్కల ప్రాధాన్యం గురించి తెలుపుతూ సాగేలా ఆ పరిచయ సన్నివేశం ఉంది. ఆల్రెడీ అమెరికాలో ఈ సీన్లు యాడ్ చేసారు. ఇండియన్ స్క్రీన్లలో కూడా ఈ సీన్ సెకండ్ వీక్ నుండి యాడ్ చేసారు. ఎన్టీఆర్, సమంత కాంబినేషన్లో వచ్చే మరిన్ని కొన్ని సీన్లను కూడా కలిపారట.
100 కోట్ల క్లబ్ లోకి 'జనతా గ్యారేజ్'
'జనతా గ్యారేజ్' సినిమా వసూళ్లలో దుమ్మురేపుతోంది. అయితే ఆ టాక్ ను అధిగమించి ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఫస్ట్ వీక్ పూర్తయ్యేనాటికి 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 'బాహుబలి' వారం రోజుల లోగా 100 కోట్లు కొల్లగొడితే, తొలి వారానికే ఆ మార్క్ ను 'జనతా గ్యారేజ్' చేరుకోవడం విశేషం.
బాలయ్య రాజసూయ యాగం
డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కోసం బాలకృష్ణ, హేమామాలిని, శ్రేయా శరన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ తాజాగా రాజసూయ యాగం చిత్రీకరణను ప్రారంభించింది. అఖండ భారతాన్ని ఏకతాటిపై తేవడానికి పురాణాలలో ధర్మరాజు, చారిత్రాత్మకంగా శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రమే ఈ యాగాన్ని నిర్వహించారు. ఈ రాజసూయ యాగ సమయంలోనే శాతకర్ణి తన తల్లి గౌతమి పేరును తన పేరు ముందు ఉంచుకుని తన పేరుని గౌతమిపుత్ర శాతకర్ణిగా మార్చుకున్నారు. ఆ రోజునే కొత్త యుగానికి ఆది ఉగాది అని ప్రకటించారు. అప్పటి నుండి అదే రోజున ఉగాది పండుగను నిర్వహిస్తూ వస్తున్నారు.
మోహన్ బాబుకి 'నవరస నట తిలకం'
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మోహన్ బాబు తెలుగు తెరపై విలక్షణమైన నటుడిగా మోహన్ బాబు తనకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నారు. తాజాగా అలాంటి మోహన్ బాబును 'నవరస నట తిలకం' బిరుదు అలంకరించనుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త .. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి మొదటి నుంచి కూడా చిత్రపరిశ్రమకి తన సేవలను అందిస్తూ .. కళాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ప్రతి ఏడాది తన పుట్టిన రోజైన సెప్టెంబర్ 17న, తమ కళాపీఠం తరఫున అవార్డులను ప్రదానం చేస్తున్నారు. అలాగే ఈ నెల 17న కూడా ఈ వేడుక విశాఖలో వైభవంగా జరగనుంది. మోహన్ బాబు 45 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని కొనసాగించిన సందర్భంగా, ఆయనకి 'నవరస నట తిలకం' బిరుదును ప్రదానం చేయనున్నారు.
అమెరికా వెళ్లనున్న 'ఫిదా' టీమ్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'ఫిదా' చిత్రం తెరకెక్కుతోంది. అమెరికా అబ్బాయికి .. తెలంగాణ అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా వివరాలను వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన షెడ్యూల్ షూటింగ్ చాలా సరదాగా జరిగిందని చెబుతూ, శేఖర్ కమ్ములతోను .. సాయి పల్లవితోను తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేశాడు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా టీమ్ అక్కడికి ప్రయాణం కట్టనుంది.