వెంకటేశ్ సరసన నిత్యా మీనన్


విక్ట‌రీ వెంకటేశ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందే సినిమాలో కథానాయికగా నిత్యామీనన్ ను ఎంపిక చేశారు. ఆమే ఈ విషయాన్ని స్వయంగా తెలియజేసింది. ఒక మధ్యవయసు వ్యక్తికి .. ఒక యువతికి మధ్య చోటుచేసుకునే ప్రేమ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. తాను ఇంతవరకూ చేయని పాత్ర కావడంతో, నిత్యామీనన్ అంగీకరించింది. 'నేను శైలజ' వంటి హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తుండటం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.


ప్రభుదేవా గురించి తమన్నా


మిల్కీబ్యూటీ తమన్నా ప్రధాన పాత్రధారిగా ఒక త్రిభాషా చిత్రం రూపొందుతోంది. తమిళంలో 'డెవిల్' .. హిందీలో 'తుటక్ తుటక్ తుటియా' .. తెలుగులో 'అభినేత్రి'అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, ప్రభుదేవా .. సోను సూద్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసే ఛాన్స్ లభించడం తన అదృష్టమని తమన్నా చెప్పింది. ప్రభుదేవా గొప్ప డాన్సర్ అనీ.. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ లభించడం తన అదృష్టమని చెప్పింది.


ఈ నెల 16 నే వ‌స్తున్న సిద్ధార్ధ 

సాగ‌ర్ హీరోగా న‌టించిన సిద్ధార్థ‌ ఈ నెల 16న విడుద‌ల కానుంది. బుల్లితెరపై త‌న స్టామినాని నిరూపించుకుని వెండితెర ద‌శ‌గా అడుగులు వేస్తున్న సాగ‌ర్ హీరోగా న‌టించిన ఈ సినిమా గురించి నిర్మాత‌ దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. మా సిద్ధార్థ‌కు సంబంధించి అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి. సెన్సార్ స‌భ్యులు ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. మ‌లేషియా, హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లోని అంద‌మైన లొకేష‌న్ల‌లో చిత్రీక‌రించాం. 4 పాట‌లున్నాయి. మ‌ణిశ‌ర్మ‌గారు అందించిన బాణీల‌కు ఇప్ప‌టికే చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఆయ‌న చేసిన రీరికార్డింగ్ సినిమాకు హైలైట్ అవుతుంది.


రజనీతో లారెన్స్‌ భేటీ 

కొరియోగ్రాఫర్‌, దర్శకనటుడు లారెన్స్‌.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాను పి.వాసు దర్శకత్వంలో నటిస్తున్న ‘శివలింగ’ గురించి రజనీకి వివరించారు. అనంతరం రాఘవేంద్ర స్వామితోపాటు తల్లికి సంబంధించిన ఆలయాల నిర్మాణం వంటి అంశాలూ ప్రస్తావనకు వచ్చాయి. వాటి ఛాయాచిత్రాలను కూడా రజనీకి చూపి సంతోషాన్ని పంచుకున్నారు. లారెన్స్‌ నడుపుతున్న ట్రస్టులోని విద్యార్థులు, దివ్యాంగుల గురించి రజనీ వాకబు చేసినట్లు సమాచారం. ఇవన్నీ తెలుసుకున్నాక లారెన్స్‌ను అభినందించారు. ఈ భేటీతో రజనీ ఆశీస్సులు అందుకోవడం ఆనందంగా ఉందని లారెన్స్‌ తెలిపారు.


జ‌య‌తి న‌టిస్తూ నిర్మిస్తున్న మూవీ ల‌చ్చి 

వెన్నెల అనే పోగ్రాం నుండి ప్ర‌తి ఇంటి ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యిన జ‌య‌తి మెట్ట‌మెదటిసారిగా హీరోయిన్ గా న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘ల‌చ్చి’. ఈ చిత్రం ద్వారా ఈశ్వ‌ర్ అనే ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం అవుతున్నాడు. హ‌ర్ర‌ర్ కామెడి లో ఓ కొత్త జోన‌ర్ ని ఈ చిత్రం ద్వారా ప‌రిచ‌యం చేస్తున్నారు. సురేష్ యువ‌న్ అందించిన ఆడియో ని అతి త్వ‌ర‌లో సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో విడుద‌ల చేయనున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాలు త్వరలోనే పూర్తి చేసి అక్టోబ‌ర్ లో సినిమాను విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: