తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘జనతా గ్యారేజ్’ పేరే వినిపిస్తుంది. ఈ నెల 1 న విడుదలైన ‘జనతా గ్యారేజ్’ మొదటి రోజు యావరేజ్ టాక్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ ఒక్కసారే నిట్టూర్పు విడిచారు..కానీ రెండవ రోజు నుంచి అనూహ్య స్పందన వచ్చింది. సినిమాపై మంచి పాజిటీవ్ టాక్ రావడంతో ఒక్కసారే కలెక్షన్లు పెరగడం మొదలయ్యాయి. అప్పటి నుంచి జనతా గ్యారేజ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. దీనికి తోడు ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి సెలవులు యాదృచ్ఛికంగా కలిసి రావడం కూడా ప్లస్ పాయింట్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు సాధించి ఎన్టీఆర్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కూడా సంతోషంలో ముంచెత్తిన చిత్రం జనతా గ్యారేజ్.
తెలుగు, మళియాలంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఇక్కడ ఎంత ఘనవిజయం సాధించిందో మాలీవుడ్ మాత్రం అంత ఘోరంగ పరాజయం పాలైంది. తెలుగులో మోహన్ లాల్ నటించిన చిత్రం ప్రత్యేకంగా ఆయన కోసం వెళ్తున్న అభిమానులు ఉంటే..మళియాలంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆయన జనతా గ్యారేజ్ లో నటించినప్పటికీ అక్కడ ప్రయోజనం లేకుండా పోయింది . మలయాళంలో ఈ చిత్రానికి కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు.
ఇప్పటివరకు నిర్మాతలు ప్రకటించిన మొత్తమే రెండున్నర కోట్ల షేర్. ఇంకా ఈ చిత్రానికి 3 కోట్లకు పైగా వస్తేనే లాభపడతారని అంటున్నారు. అయితే ఈ చిత్రం విడుదలైన ఇప్పటికే పన్నెండు రోజులు అవుతున్నా రిజల్ట్ మాత్రం అంతంత మాత్రంగానే ఉండటం మహా అంటే ఓ కోటి రూపాయలు వస్తాయో రావో అన్న ఆలోచనలో ఉన్నారట. మొత్తానికి మలయాళంలో ఓవరాల్ గా జనతా గ్యారేజ్ ఫ్లాప్ జాబితాలో చేరినట్లే అని అంటున్నారు.