అట్టహాసంగా ‘జాగ్వార్‌’ పాటల వేడుక


మాజీ ప్రధాని దేవెగౌడ మనువడు నిఖిల్‌ కుమార్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ చిత్రం ‘జాగ్వార్‌’. ఎస్‌ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద‌రాబాద్ నోవాటెల్‌ హోటల్‌లో అట్టహాసంగా జ‌రిగింది. జాగ్వార్ సినిమాతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార్ స్వామీ కొడుకు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే.


‘జాగ్వార్’ ఆడియో వేడుకలో ఊహించని అతిథులు 


నిఖిల్‌ కుమార్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న‌‘జాగ్వార్’ సినిమా ఆడియో వేడుకకు వివిధ రంగాలకు చెందిన విశిష్ఠ వ్యక్తులు హాజరయ్యారు. ముఖ్యంగా మాజీ ప్రధాని దేవేగౌడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, పీవీ.సింధూ, పుల్లెల గోపీచంద్, బ్రహ్మనందం, సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ ఈ కార్యక్రమానికి హాజరవడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 


కేటీఆర్ తెలంగాణ ముద్దుబిడ్డ: బ్రహ్మనందం 

జాగ్వార్ ఆడియో వేడుకలో హాస్యనటుడు బ్రహ్మనందం చాలా ఆసక్తిగా మాట్లాడారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘‘తెలంగాణ ముద్దుబిడ్డ కేటీఆర్ మనముందు ఉన్నారు’’ అని బ్రహ్మనందం అనగానే వేడుకలో సందడి నెలకొంది. 


సమంతతో పెళ్లిపై నాగచైతన్య క్లారిటీ


నాగ చైతన్య తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేశాడు. హీరోయిన్ సమంతతో చైతూ వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, వీరి పెళ్లి ఎప్పుడన్న విషయంలో మాత్రం ఇంతవరకు సరైన క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది తమ వివాహం జరుగుతుందని చైతూ తెలిపాడు. సెలెబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ కు సంబంధించి టాలీవుడ్ థండర్స్ జట్టుకు నాగ చైతన్య బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టు పరిచయ కార్యక్రమం నిన్న చెన్నయ్ లో జరిగింది. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ, సమంతతో తన వివాహం వచ్చే ఏడాది జరుగుతుందని చైతూ వెల్లడించాడు. అయితే, వివాహానికి డేట్ మాత్రం ఇంకా నిర్ణయించలేదని చెప్పాడు. 


రెడీ అవుతున్న రేష్మి మూవీ


యాంక‌ర్, హీరోయిన్ రేష్మి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘తను వచ్చెనంట’ సినిమాతో త్వ‌రలోనే రేష్మీ ఆడియ‌న్స్ ముందుకు రాబోతోంది. తొలిసారి తెలుగు చలన చరిత్రలో జాంబీ నేపధ్యంతో ‘తను వచ్చెనంట’ చిత్రం తెరకెక్కింది. జాంబి, కామెడీ కాంబినేషన్‌లో జామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంలో రేష్మి ఓ ప్రధాన పాత్ర పోషించగా తేజ, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి వెంకట్ కచర్ల దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ విడుదల చేయడంతో పాటు సెప్టెంబర్ 30న ‘తను వచ్చెనంట’ థియేటర్లలోకి రానున్నట్టు ప్ర‌క‌టించారు.


బోయ‌పాటితో ఎన్టీఆర్ సినిమా!?


యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం జూనియర్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ బోయపాటి శీను కొట్టేసినట్టు తెలుస్తోంది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న బోయపాటి ఎన్టీఆర్ దమ్ముని మరో సారి చూపించబోతున్న‌ట్టే తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ కోసం పూరి జగన్నాద్, వక్కంతం వంశీ, లింగుస్వామి లైన్లో ఉండగా ప్రస్తుతం బోయపాటి ఎంట్రీ అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. మరి బోయపాటి ఎన్టీఆర్ కి దమ్ము లాంటి కథ ఇస్తాడా లేక లెజెండ్ లాంటి కథతో నందమూరి అభిమానులని ఉబ్బితబ్బిబు అయ్యాలా చేస్తాడో చూడాలి.


గ్రాండ్‌గా ప్రేమ‌మ్ ఈవెంట్‌కు ప్లాన్

నాగ చైతన్య, చందు మొండేటి దర్శకత్వంలో ప్రేమమ్ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ లు ఈ చిత్రం లో కథానాయికలుగా నటించగా వెంకీ, నాగ్ లు కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా దసరాకి ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 7న ప్రేమమ్ చిత్రం విడుదల కానున్నట్టు వార్తలు వస్తోండగా సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ప్రేమమ్ ఆడియో వేడుకని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  అక్కినేని జయంతితో పాటు ప్రేమమ్ పాటల వేడుకని గ్రాండ్ గా నిర్వహించాలని యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: