తమిళ ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత అంత గొప్ప ఫాలోయింగ్ సంపాదించిన హీరో అజిత్ కుమార్.  గత సంవత్సరం వచ్చిన వేదలం చిత్రం సూపర్ డూపర్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. కేవలం నటుడిగానే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాడు అజిత్. తన సహనటి శాలినిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం..వాస్తవానికి అజిత్ పక్కా హైదరాబాదీ. పుట్టి పెరిగింది హైదరాబాద్ లో అయినా తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన హీరో.  

ఇక అజిత్ కి బైక్ రైసింగ్, కార్ రైసింగ్ అన్నా ఎంతో ఇష్టం..ఈ క్రమంలో ఎన్నో సార్లు ప్రమాదాలు జరిగాయి. అయినా కూడా వాటిపై ఏమాత్రం ఫ్యాషన్ తగ్గలేదు. అజిత్ సినిమాలో హీరోగా ఉన్న బయట మాత్రం చాలా సాధారణ మైన జీవితం గడుపుతుంటారు.

బైక్ పై కూరగాయలు తీసుకు రావడం..సినిమా హాల్స్ కి వెళ్లడం ఇలా జనాల్లో కలిసిపోతుంటారు. ఆ మద్య ఎలక్షన్స్ జరిగినపుడు సాధారణ వ్యక్తి మాదిరి లైన్లో నిల్చొని ఓటు వేశారు. దటీజ్ అజిత్..


మరింత సమాచారం తెలుసుకోండి: