అఖిల్‌తో స‌మంతా సంద‌డి

కాబోయే మ‌రిది అఖిల్‌తో స‌మంతా సంద‌డి చేసింది. ఇంత‌కీ మ‌రిది వ‌దిన‌ల సంద‌డి ఎక్క‌డో తెలుసా.. సోమాజిగూడలో నూతనంగా ఏర్పాటుచేసిన ఓ షాపింగ్‌మాల్‌ను అఖిల్‌తో క‌లిసి స‌మంత‌ ప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా స‌మంత‌ను, అఖిల్‌ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ సందర్భాన్ని బట్టి దుస్తులు ధరిస్తానని తెలిపారు. అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు కొంత ఇబ్బందిపడ్డారు.


అస్కార్ బ‌రిలోకి త‌మిళ మూవీ!


తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన ‘విసారణై’ మూవీ 2017కుగాను ఆస్కార్ నామినేషన్లలో చోటు సంపాదించుకుంది. ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో భారత్ నుంచి ఈ మూవీ ఆస్కార్‌కు ఎంపికైంది. ప్రధానంగా పోలీసుల చుట్టూ తిరిగే ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమాకు మూడు జాతీయ అవార్డులు రావడమే కాకుండా.. అంతర్జాతీయ స్థాయిలో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా విడుదలకు ముందే 72వ వెనీస్ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లడం విశేషం. విసారణై 2015లో విడుదలైంది.


100కోట్ల క్లబ్‌లోకి ‘ఇంకొక్కడు’..!


కోలీవుడ్ స్టార్ విక్రమ్ నటించిన ఇంకొక్కడు మంచి హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద కలెకన్లతో దూసుకెళ్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 8న విడుదలైన ఇంకొక్కడు గత ఆదివారానికి రెండు భాషల్లో రూ.90కోట్లు వసూలు చేసిన ఇంకొక్కడు ఈ వారం రూ.100కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టనుందని కోలీవుడ్ సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నిత్యమీనన్, నయనతార హీరోయిన్లు కాగా..నాజర్ కీలక పాత్ర పోషించారు.

త‌మిళంలోకి ఎంట్రీ ఇస్తోన్న రాశిఖన్నా


ఇటీవ‌ల తమిళ సినిమాలపై దృష్టి పెట్టిన టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా, అక్కడ ఒక ఛాన్స్ కొట్టేసింది. తమిళంలో సిద్ధార్థ హీరోగా 'సైతాన్ కా బచ్చా' అనే చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశిఖన్నాను ఎంపిక చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక తెలుగుతో పాటు, తమిళంలోను రాశి ఖన్నా స్పీడు పెంచనుంది. 


ఇకపై పాడనంటోన్న జానకి


48,000లకు పైగా పాటలను పాడి లక్షలాది మందిని తన గాత్రంతో ఓలలాడించిన ప్రముఖ గారుుని జానకి షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇక పాట‌లు పాడ‌న‌ని ప్ర‌క‌టించారామే. అనూప్ మీనన్ .. మీరా జాస్మిన్ కాంబినేషన్లో '10 కాల్పనికాల్' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో "అమ్మా పూవీను .. " అనే పాటను జానకి పాడారు. తనకి నచ్చిన పాటల్లో ఇది ఒకటి అని జానకి అన్నారు. తన కెరియర్లో ఇదే చివరి పాట అవుతుందనీ, ఇక తాను సినిమాల్లో గానీ .. స్టేజ్ లపై గాని పాడనని చెప్పారు. ఇది నిజంగా ఆమె అభిమానులకు బాధను కలిగించే విషయమే.



మరింత సమాచారం తెలుసుకోండి: