టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలతో నటిస్తూ బిజిగా ఉన్న రాశీఖన్నా ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది. ఒకవైపు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చేస్తూనే, మరోవైపు కోలీవుడ్ ఫిల్మ్ ఇండవస్ట్రీ నుండి అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఇవి కాకుండా బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ రాశీఖన్నా మంచి ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. ఇలా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో మంచి అవకాశాలను చేజిక్కించుకునేందుకు ఈ బ్యూటీ ప్రయత్నాలు చేస్తూ ఉంది.


ఇదిలా ఉంటే ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రాలు కమర్షియల్ సక్సెస్ ని సాధించటంతో తనకి రెమ్యునరేషన్ సైతం పెరుగుతూ వస్తుంది.  ‘ఊహలు గుసగుసలాడే’ ద్వారా హీరోయిన్ గా పరిచయమైన రాశీఖన్నా, తక్కవ సమయంలోనే ఎక్కువ అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే ఈ బ్యూటీకి చెన్నైలో, ముంబాయ్ లో ఇల్లులని కొనుక్కొంది. అది కాగ తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఓ ఇంటిని కొనుగోలు చేసినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి.


తెలుగులో రాశీఖన్నాకి పెరుగుతున్న అవకాశాల కారణంగా తను తరుచు హైదరాబాద్ రావాల్సి ఉంది. అయితే ఇక్కడ వచ్చిన ప్రతీసారి తనకి హోటల్స్ లోనూ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరో తన గెస్ట్ హౌస్ ని అమ్మకానికి పెట్టాడు. ఫిల్మ్ నగర్ లో ఉన్న హౌస్ ని రాశీఖన్నా చూసి…సింగిల్ ఢీల్ తో ఆ హౌస్ ని కొనుక్కొని తన సొంతం  చేసుకుందని అంటున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఆ ఇంటికి పూజలు నిర్వహించి ఎంట్రి ఇవ్వనుందని అంటున్నారు.


ప్రస్తుతం రాశీఖన్నా చేతిలో 4 తెలుగు చిత్రాలు, 2 తమిళ చిత్రాలు ఉన్నాయి. ఇవికాకుండా హిందీలో 2 ప్రాజెక్ట్స్ పైప్ లైన్ లో ఉన్నాయి. హీరో సిద్ధార్థ్ కాంబినేషన్ లో రాశీఖన్నా తమిళ్ లో చేస్తున్న చిత్రంపై భారీ ఆశలను పెట్టుకుంది. అలాగే తెలుగులోనూ ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ లో ఈ బ్యూటీని ఆఫర్ వరించిందనే టాక్స్ సైతం బలంగా వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: